వాళ్లిద్దరూ లేడీ ఎమ్మెల్యేలే.. అందులోనూ ఒకే పార్టీకి చెందినవారు.. అంతే కాదు.. ఇద్దరి నియోజక వర్గాలు కూడా పక్కపక్కనే.. కానీ వీరిద్దరికీ సరిగ్గా పడటం లేదట. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో వీరిద్దరరి మధ్య విబేధాలు బయటపడ్డాయి. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, చిలకలూరి పేట ఎమ్మెల్యే విడుదల రజనీ మధ్య ఉన్న విబేధాలు మేడికొండూరు మండలం తురకపాలెంలో మసీదు శంకుస్థాపన కార్యక్రమంలో బహిర్గతమయ్యాయి.


వాస్తవానికి ఈ కార్యక్రమం జరిగింది తాడేపల్లి నియోజక వర్గం పరిధిలో.. అక్కడి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి.. కానీ ఈ కార్యక్రమానికి పొరుగున ఉన్న ఎమ్మెల్యే విడదల రజినీని ఆహ్వానించడం శ్రీదేవికి కాస్త చిరాకు తెప్పించిందట. సరే పోనీ లెమ్మని సర్దుకుని ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు శ్రీదేవి.


అయితే.. ఇక్కడి మసీదు అభివృద్ధికి రూ. 10 లక్షలు ఇస్తానని విడదల రజినీ హామీ ఇచ్చారట. దాంతో ఈ కార్యక్రమం నిర్వహించే వారు.. విడదల రజినీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. పక్కనే ఉన్న లోకల్ ఎమ్మెల్యే శ్రీదేవిని పెద్దగా పట్టించుకోలేదట. ఇద్దరూ ఒకే స్టేజీపైన కూర్చున్నా.. ముందుగా విడదల రజినీకి శాలువా కప్పి సన్మానం చేశారట. దీంతో లోకల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి బాగా కోపం వచ్చేసింది. కానీ ఏం చేయలేక మధ్యలోనే కార్యక్రమం నుంచి బయలుదేరారట.


ఉండవల్లి శ్రీదేవి అలకతో విషయం తెలుసుకున్నారు నిర్వాహకులు. అర్రె.. ఎమ్మెల్యేకు కోపం వచ్చేసిందే అని అప్పుడు సర్దుకుని బతిమాలడం మొదలు పెట్టారట. కానీ అప్పటికే కోసం నషాళానికంటిన శ్రీదేవి అక్కడి నుంచి సైలంట్ గా వెళ్లిపోయారట. ఈ విషయం విడదల రజనీ వరకూ వెళ్లిందట. ఆమె మాత్రం ఏం చేస్తుంది.. సరే లెమ్మని కార్యక్రమం కొనసాగించిందట విడదల రజినీ. ఇప్పుడీ ఇద్దరు ఎమ్మెల్యేల ఫైటింగ్ హాట్ టాపిక్ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి: