మెగాస్టార్ సైరా తో సంచలనం సృష్టించేలా ఉన్నాడు.. ఇప్పటి వరకూ విడుదలైన టీజర్,ట్ర్రైలర్ , మేకింగ్ షాట్స్ అంచనాలు పెంచేస్తున్నాయి. అక్టోబర్ 2న సైరా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు వరకూ ఓకే.. మరి మిగిలిన భాషల్లో మెగాస్టార్ కు అంత క్రేజ్ ఉందా.. ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రాబట్టాలంటే.. మెగాస్టార్ క్రేజ్ ఒక్కటే సరిపోదా..


అందుకే ఇప్పుడు మెగాస్టార్ జోరుకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా తోడవుతున్నాడా.. అవును..హీరో ప్రభాస్.. మెగాస్టార్ చిరంజీవి 'సైరా'కు దేశవ్యాప్తంగా ప్రచారం చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్​గా ఇప్పటికే గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.


ఇక మెగా స్టార్ సైరా.. ఆదివారం ప్రీరిలీజ్​ వేడుక నిర్వహించుకుంది. ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు తుది మెరుగులు దిద్దుకుంటోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్ బయటకు వచ్చింది. 'బాహుబలి'తో పాన్ ఇండియా గుర్తింపు పొందిన ప్రభాస్​ను 'సైరా'కు ప్రచారం చేయమని చిరు రిక్వెస్ట్ చేశాడట.


మెగాస్టార్ అంతటి వాడే అడిగే సరికి డార్లింగ్ ప్రభాస్ కూడా కాదనలేకపోయాడట. త్వరలోనే ప్రభాస్ దేశవ్యాప్తంగా సైరా ప్రచార వేడుకల్లో పాల్గొంటాడట. ఇక రాయలసీమకు చెందిన స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే.


ఈ సినిమాలో చిరంజీవితో పాటు అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతిబాబు వంటి భారీ తారాగణం ఉంది. తాజాగా విడుదలైన మేకింగ్ వీడియో కూడా ఆసక్తి పెంచుతోంది. ఒక్కొక్కరి పాత్రలను వివరిస్తూ సాగిన మేకింగ్ వీడియో అంచనాలు పెంచేస్తోంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న ఈ సైరాకు సంగీతం అమిత్ త్రివేది అందిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: