భారత్ - పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. పుల్వామా దాడితో ప్రారంభమైన ఈ సెగలు.. కాశ్మీర్ లో 370ఆర్టికల్ రద్దుతో మరింత జోరందుకున్నాయి. ఇటీవల తరచూ రెండు దేశాధినేతల మాటల్లో యుద్ధం ప్రస్తావన వస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అయితే సాంప్రదాయ యుద్ధంలో భారత్ తో గెలవలేం కానీ.. అణుయుద్ధంతో ఇద్దరం నాశనం అవుతామని డైరెక్టుగా చెబుతున్నాడు.


ఈ నేపథ్యంలో అసలు ఇండియా- పాక్ మధ్య అణు యుధం వస్తే ఏమవుతుంది.. ఇదే అంశంపై అమెరికాలోని కొలరాడో బౌల్డర్‌ అండ్‌ రట్జర్స్‌ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు పరిశోధన చేశారు. కొన్ని షాకింగ్ వాస్తవాలు చెబుతున్నారు. యుద్ధం అంటూ వస్తే ఎలా ఉంటుందో కళ్లకు కడుతున్నారు.


వారు చెబుతున్న దాన్ని బట్టి చూస్తే.. భారత్‌, పాకిస్థాన్‌ మధ్య అణుయుద్ధమంటూ జరిగితే.. వారం రోజుల్లోపే 5 కోట్ల నుంచి 12.5 కోట్ల మంది దాకా ప్రాణాలు కోల్పోతారట. ఎందుకంటే.. రెండు దేశాల వద్దా చెరో 150 దాకా అణు వార్‌హెడ్లు ఉన్నాయి. 2025 నాటికి ఆ సంఖ్య 200-250కి చేరొచ్చు. అప్పుడు గనక యుద్ధం జరిగితే మరణాల రేటు రెట్టింపు అవుతుందట.


కేవలం ప్రాణ నష్టమే కాదు.. అణుధార్మిక ప్రభావానికి గురయి సుదీర్ఘకాలం అనారోగ్యంతో బాధపడి చనిపోయేవారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందట. అంతే కాదు.. ప్రపంచం మీద ఈ యుద్ధ ప్రభావం చాలా ఉంటుందట. ప్రకృతిపై ఆ యుద్ధం వేసే ముద్ర బీభత్సమట. అసలు ఇలాంటి యుద్ధాన్ని ఇంతవరకు మానవజాతి చవిచూసి ఉండబోదంటున్నారు. అణుబాంబులు పేలడం వల్ల వాటి నుంచి వెలువడే 16 నుంచి 36 మిలియన్‌ టన్నుల నల్లటి, సూక్ష్మమైన కార్బన్‌ అణువులు వాతావరణంలో పై భాగానికి చేరి వారం రోజుల్లో విశ్వమంతా వ్యాపిస్తుందట.


మరింత సమాచారం తెలుసుకోండి: