హుజూర్‌నగర్‌లో ఉప ఎన్నికలు అక్టోబర్ 21న జరగనున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ గా విజయం సాధించిన త్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల బరిలో మొత్తం 76 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా మొత్తం 28 మంది అభ్యర్థులు నిలిచారు.
అక్టోబర్ 3న  సాయంత్రం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు విత్‌డ్రా చేసుకున్నారు.


45 నామినేషన్లను వివిధ కారణాలతో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. దీంతో 28 మంది బరిలో నిలిచారు.  సీపీఎం అభ్యర్థి శేఖర్ రావు నామినేషన్‌ తిరస్కరణకు గురికాగా ..... స్వతంత్ర అభ్యర్థులు ప్రతాప్‌ రెడ్డి, సైదులు, శంకర్‌ లు సైతం తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.దీంతో ప్రధాన పార్టీల మధ్యే పోటీ నెలకొంది.టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సైదిరెడ్డి, కాంగ్రెస్‌ తరఫున టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి కిరణ్మయి హుజూర్‌నగర్ ఉప ఎన్నికల బరిలో ఉన్నారు.

అంటే పోటీ ప్రధానంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే నెలకొండన్నమాట. ఇక  ఆసక్తికర విషయం ఏంటి అంటే సీపీఐ పార్టీ అధికార టీఆర్‌ఎస్ పార్టీకి మద్దతిస్తుండటం. 2018 డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మహాకూటమితో కలిసి పోటీ చేసిన సీపీఐ.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి షాకిస్తూ ‘కారు’ పార్టీతో చేతులు కలిపింది.


ఇక టీడీపీ పార్టీ సీపీఎం మద్దతును కోరుతుండగా.. టీజేఎస్ ఇప్పటికే కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది. మొత్తం మీద గత ఎన్నికల్లో మహా కూటమిగా ఏర్పడిన పార్టీలన్నీ ఈసారి విడివిడిగా పోటీ చేస్తుండటం గమనించదగ్గ విషయం.ఈ నెల 24న ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: