ఓ ఎమ్మెల్యే హద్దు మీరి ప్రవర్తించాడు.. అందులోనూ అధికార పామ్మెల్యే.. ఫుల్లుగా మందు కొట్టి ఓ ఎంపీడీవో ఇంటికి వెళ్లి రచ్చరచ్చ చేశారు. పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. అతడిని అరెస్టు చేయాలా వద్దా.. ఇదే సందేహం... సీఎం దగ్గర పోలీసు బాసులు వెలిబుచ్చారు.


అధికార పార్టీ ఎమ్మెల్యే కదా ఏదో మేనేజ్ చేస్తారులే అని అంతా అనుకున్నారు.. కానీ సీఎం సొంత ఎమ్మెల్యేను అరెస్టు చేయించి అందరికీ షాక్ ఇచ్చారు. దటీజ్ జగన్ అనిపించారు.జగన్ ఢిల్లీ నుంచి రాగానే.. నెల్లూరు ఘటనపై ఆరా తీశారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. డీజీపీ గౌతం సవాంగ్‌ సీఎంకు వివరాలు నివేదించారు.. చట్టం ముందు అందరూ సమానమేనని డీజీపీకి సీఎం స్పష్టంచేశారు. చట్టాన్ని ధిక్కరించేవారు ఎవ్వరైనా ఉపేక్షించవద్దని డీజీపీకి జగన్ ఖరాఖండిగా చెప్పారు.


ఆధారాలు ఉంటే... చట్టప్రకారం ఏ చర్యకైనా వెనకాడవద్దని డీజీపీని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. అంతే.. వెంకటాచలం ఎంపీడీవో సరళ కేసు విషయంలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. తనను కోటంరెడ్డి బెదిరించారంటూ ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. కోటంరెడ్డిని అరెస్ట్ చేశారు.


ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే.. సేమ్ సీన్ చంద్రబాబు ప్రభుత్వంలోనూ జరిగింది. అక్కడా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా ఓ ఎమ్మార్వోను జుట్టుపట్టుకుని ఈడ్చి కొట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయనా అప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేనే. ఈ విషయంపై అప్పట్లో చాలా దుమారం రేగింది. పత్రికలు పుంఖానుపుంఖాలుగా కథనాలు రాశాయి.


కానీ అప్పటి సీఎం చంద్రబాబు చింతమనేనిపై ఈగ వాలనీయలేదు. పైగా బాధితురాలిని పిలిపించుకుని వ్యవహారం సెటిల్ చేశారని వార్తలు వచ్చాయి. ఇప్పటి వ్యవహారాన్ని అప్పటి వ్యవహారాన్ని పోల్చి చూస్తే జగన్, చంద్రబాబు మధ్య తేడా స్పష్టంగా తేలిపోతుందంటున్నారు విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి: