ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ విదేశాలకు పారిపోయానట్టు మొన్న వార్తలు వచ్చాయి. దీంతో ఆ వార్తలపై అఖిల ప్రియా ఘాటుగా స్పందించింది. తన భర్త ఎక్కడ ఉన్నడో తెలియదని, పారిపోవాల్సిన అవసరం తన భర్తకు లేదని ఆమె వ్యాఖ్యానిచ్చారు. 

            

అయితే కేసులు పెట్టినప్పటి నుండి తన భర్త తనతో టచ్ లో లేరని, తన భర్తపై నమోదు అయినా కేసులు అన్ని తప్పుడు కేసులని.. ఈ విషయం పోలీసులకు కూడా తెలుసనీ ఆమె వ్యాఖ్యానించారు. అయితే క్రషర్ ఫ్యాక్టీరిలో ఆమెకు భాగం ఉందని, సమన హక్కులు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. 

               

ఈ విషయాన్నీ తన భర్త భార్గవ్ రామ్ వెళ్లి అడిగితే పెద్ద నేరం, ఘోరమన్నట్టు చూపిస్తున్నారని, అక్కడ అడగడం తప్ప ఎవర్ని కొట్టలేదని, కొట్టిన దెబ్బలు తగలలేదని.. అలాంటి ఆధారాలు ఏవి లేవని ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                 

అయితే ఈ ఇంటర్వ్యూ చుసిన నెటిజన్లు.. సోషల్ మీడియా వేధికగా ట్రోల్ చేస్తున్నారు. కేసులు ఉంటె భర్తతో టచ్ లో ఉండరా అని ఒకరు అంటే.. ఏ తప్పు చెయ్యకపోతే ఎందుకు పరారీలో ఉన్నాడు అంటూ ప్రశ్నిస్తున్నారు. కాగా అఖిల ప్రియ భర్తపై ఆళ్లగడ్డలోను, హైదరాబాద్ లోను పలు కేసులు నమోదు అయ్యాయి. కేసులు నమోదు అయినప్పటి నుండి భార్గవ్ రామ్ కనిపించడం లేదు.. దీంతో భార్గవ్ రామ్ స్నేహితులను విచారించగా భార్గవ్ రామ్ గ్రీస్ లో ఉన్నాడని తెలిసింది. 

                


మరింత సమాచారం తెలుసుకోండి: