ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకురాలు భూమా అఖిలప్రియ నిన్న ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ తన భర్త పరారీపై, ఆమె రాజకీయ జీవితం గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అఖిల ప్రియ. తన భర్తకు పారిపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదని, కేసులు కొత్త కాదని ఆమె చెప్పుకొచ్చారు.    

                

వ్యాపార భాగస్వామిపై అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ దాడికి పాల్పడ్డాడు అని కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్ లో అయన కేసు నమోదు ఆయన విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో భార్గవ్ రామ్ పై హైదరాబాద్ లోను పలు కేసులు నమోదయ్యాయి. దీంతో భార్గవ్ రామ్ గత 10 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు.       

             

అయితే ఈ విషయంపై అఖిల ప్రియని ప్రశ్నిస్తే తన భర్తకు పారిపోవాల్సిన అవసరం లేదని.. ఆ కేసులు నిజం కాదని ఆమె చెప్పారు. క్రషర్ ఫ్యాక్టరీ లో గతంలోనే భాగస్వాములు అని ఒకవేళ అది కావాలనుకుంటే మంత్రి పదవిని అడ్డుపెట్టుకొని అప్పుడే బెదిరించే దాన్ని అని అఖిల ప్రియ వ్యాఖ్యానించింది.    

               

అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు స్పందిస్తూ.. అలా బెదిరించినందుకే కాదమ్మా ఈసారి నువ్వు ఓడిపోయిందని అని ఒకరు అంటే.. అప్పుడు చేసిన దుర్మార్గాలే ఇప్పుడు బయటకు వస్తున్నాయిలే అని మరొకరు అంటున్నారు. ఏది ఏమైనా భర్త అజ్ఞాతంలోకి వెళ్తే భార్య తెలియదు అనడం ఆశ్చర్యకరమైన విషయం. 

               

మరింత సమాచారం తెలుసుకోండి: