తెలంగాణాలో రోజు రోజుకు అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి. తెలంగాణ మొత్తంలో రోజుకు ఒకటైన అత్యాచారాలకు సంబంధించి వార్తలు వస్తున్నాయి. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అని కూడా లేకుండా అత్యాచారాలు చేసేస్తున్నారు ఈ కామాంధులు. మొన్నటికి మొన్నా ఓ నీచుడు ఆవుదూడపై అత్యాచారం చేశాడు. నిన్నటికి నిన్న ఓ ఎయిడ్స్ రోగి 7 ఏళ్ళ చిన్నారిపై అత్యాచారం చేశాడు.    

         

ఇంకా వివరాల్లోకి వెళ్తే.. ఈరోజు బోరబండలో ఓ నీచమైన ఘటన జరిగింది. వావి వరసలు మరిచిన తండ్రి కామంతో కళ్ళు మూసుకుపోయి కన్న కూతురిపై అత్యాచారం చెయ్యడానికి యత్నించాడు. అయితే తండ్రి నుంచి తప్పించుకున్న బాలిక పక్కింటివారిని ఆశ్రయించడంతో నిందితుడు అక్కడ నుండి పారిపోయాడు. ఈ ఘటన బోరబండలో జరిగింది.        

        

బోరబండకు చెందిన వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఆ వ్యక్తికి ఓ భార్య, ఇద్దరు కుమారులు, తొమ్మిదేళ్ల వయసున్న ఓ కూతురు ఉంది. అయితే ఆ నీచుడు ఆ తొమ్మిదేళ్ల బాలికపై కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి యత్నించాడు. అయితే ఆ బాలిక తప్పించుకొని పక్కింటి వారిని ఆశ్రయించింది.  

     

తల్లి వచ్చిన తర్వాత తండ్రి దుర్మార్గాన్ని బాలిక చెప్పడంతో ఆమె ఎస్సార్‌నగర్‌ పోలీసులను ఆశ్రయించి భర్తపై కేసు పెట్టింది. కూతురి జీవితాన్నే నాశనం చెయ్యాలనుకున్న తన భర్తపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనప్పటికి తెలంగాణాలో రోజుకో ఘటన ఇలాంటిది చోటుచేసుకుంటుంది. బాధితులు అంత కూడా పదేళ్లలోపు వయసు ఉన్న పిల్లలే కావడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

          

మరింత సమాచారం తెలుసుకోండి: