రాష్ట్రంలో జగన్ నిర్వహించిన ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా తనను కలసి ప్రజలెందరో చెప్పుకున్న సమస్యలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నాడు జగన్. ఇందులో భాగంగా చేనేతలను ఆదుకునేందుకు అప్పట్లోనే ఆయన హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్థికంగా ఆదుకుంటానని చెప్పిన మాటను ఇప్పుడూ సాకారం చేస్తున్నాడు.. అంతే కాకుండా జగన్ ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లోనే అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అద్భుతమైన పథకాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.


అటు నిరుద్యోగులపై ఉద్యోగ వరాలు కురిపిస్తూ.. లక్షల సంఖ్యలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్న జగన్.. ఎన్నికలకు ముందు తాను నిర్వహించిన ప్రజా సంకల్ప పాదయాత్రలో ఇచ్చిన హామీల మేరకు అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటిగా  ఓ క్రమంలో పూర్తి చేస్తున్నారు. వృద్ధులకు పింఛన్ల పెంపు - గ్రామ సచివాలయాల ఏర్పాటు - మద్య నిషేధం - రైతు భరోసా - వైఎస్సార్ వాహన మిత్ర - నాణ్యమైన బియ్యం పంపిణీ ఇలా అనేక పథకాలను ప్రవేశ పెడుతున్నారు.. ఒకపక్క ఆర్థిక పరిస్థితి అంతంతలా ఉన్నా.. రైతు ఆనందంగా ఉండాలనే కృత నిశ్చయంతో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా పధకాన్ని ప్రారంభించారు. అదీగాక పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తున్న విషయం తెలిసిందే.


ఇకపోతే జగన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అదేమంటే చేనేత కుటుంబాలకు ఆర్ధిక సాయంపై జరిగిన చర్చలో ఈ పథకానికి కేబినెట్ ఆమోదం లభించింది. పథకంలో భాగంగా "వైఎస్సార్ చేనేత నేస్తం" పేరుతో సంవత్సరానికి రూ. 24 వేల మేర ఆర్ధిక సాయాన్ని అందంచనున్నారని తెలిపారు. అందుకు గాను ప్రతీ ఏడాది డిసెంబర్  21వ తేదీన చేనేత కుటుంబాలకు బ్యాంక్ ద్వారా ఆర్ధిక సాయం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే రూ. 24 వేలు ఆర్థిక సాయం ఒకే విడతగా చేయాలని కేబినెట్ నిర్ణయించింది..ఇక ఈ "చేనేత నేస్తం" పథకానికి రూ. 216 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తుండగా, ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 90 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ..


మరింత సమాచారం తెలుసుకోండి: