కెనడా పార్లమెంటు ఎన్నికల్లో అధికార లిబరల్ పార్టీ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించి, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మార్క్‌ను అందుకోలేకపోయింది. అయితే, ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జగ్మీత్ సింగ్ నాయకత్వంలోని న్యూ డెమోక్రాటిక్ పార్టీ (ఎన్‌డీపీ) కింగ్‌‌మేకర్‌గా అవతరించడం విశేషం. 

 

హౌస్ ఆఫ్ కామన్స్‌లోని మొత్తం 338 స్థానాలకు గానూ ప్రధానమంత్రి జస్టిన్‌ ట్రుడోకు చెందిన లిబరల్‌ పార్టీ 157 చోట్ల విజయం సాధించింది. ప్రధాన ప్రతిపక్షం కన్జర్వేటివ్‌ పార్టీ 121, బ్లాక్‌ క్యుబెకోయిస్‌ పార్టీ 32, ఎన్‌డీపీ 24, గ్రీన్‌ పార్టీ 3 స్థానాల్లోనూ ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

 

ఎన్‌డీపీ కంటే అధిక స్థానాల్లో విజయం సాధించిన బ్లాక్ క్యబెకోయిస్ ట్రుడోకు మద్దతు ఇవ్వడానికి ఆసక్తిచూపడం లేదు. దీంతో జగ్మీత్‌ సింగ్‌ కీలకంగా మారారు.గ్రీన్‌పార్టీ ప్రతిపక్షంలోనే ఉంటామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో 24 స్థానాల్లో విజయం సాధించిన జగ్మీత్‌ నేతృత్వంలోని ఎన్‌డీపీ పాత్ర కీలకంగా మారింది. ట్రుడోకు మద్దతివ్వడానికి జగ్మీత్ సింగ్ కూడా సుముఖంగా ఉన్నారు.

 

ఈ విషయమైన జగ్మీత్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని ట్రూడో ప్రస్తుతం మైనార్టీలో ఉన్నారనే వాస్తవాన్ని గౌరవిస్తారని భావిస్తున్నామని ఎందుకంటే మనం కలిసి పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

 

ప్రభుత్వం తమ కోసం పనిచేయాలని కెనడా ప్రజలు కోరుకుంటున్నారని సింగ్ పేర్కొన్నారు. కెనడా ఎన్నికల ఫలితాలపై పంజాబ్ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూడటానికి కారణం కాగా, ట్రూడో తన క్యాబినెట్‌లో నలుగురు సిక్కులకు అవకాశం కల్పించడమే. ట్రూడో ప్రభుత్వంలో మంత్రులుగా చేసిన హరిజిత్ సింగ్ సాఝాన్, నవదీప్ బెయిన్స్, జగదీశ్ చాగ్గర్ తమ స్థానాలు నిలబెట్టుకోగా, అమరజీత్ సింగ్ సోహి ఓటమి చవిచూశారు. ప్రముఖ సిక్కు నేత, కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి టిమ్ ఉప్పాల్ చేతిలో ఆయన ఓడిపోయారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: