కొందామంటే బంగారం అయినా దొరుకుతుందేమో కానీ.।. ఇసుక మాత్రం దొరకడం లేదని ప్రతిపక్షనేత చంద్రబాబు విమర్శించారు. ఈ విమర్శ కాస్త శ్రుతి మించినట్టున్నా.. రాష్ట్రంలో ఇసుక కొరతు ఉందని అధికార వైసీపీయే అంగీకరిస్తోంది. అందుకే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయమంతా ఇసుక చుట్టూ తిరుగుతోంది.


గత చంద్రబాబు ప్రభుత్వాన్ని కూల్చడంలోనూ ఈ ఇసుక వ్యవహారం ప్రధాన కారణమని వాదన ఉంది. ఇప్పుడు వైసీపీ హయాంలోనూ ఇసుక ప్రధాన అంశంగా మారింది. అయితే ఈ ఇసుక కొరతపై వైసీపీ నేతలు కొంత వివరణ ఇస్తున్నారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉండటం పూర్తి అవాస్తవం కాదంటూ అందుకు కారణాలు వివరిస్తున్నారు.


వారేమంటున్నారంటే... “ నిర్మాణ రంగానికి సరిపడా పూర్తి ఇసుక లభ్యత అనేది రాష్ట్రంలో గతంలోనూ లేదు. ఇసుక సరఫరా విషయంలో జిల్లాల వారీగా తేడాలు ఉంటాయి. 2015లో గత ప్రభుత్వం విడుదల చేసిన శ్వేత పత్రం చూస్తే ఆ విషయం క్లియర్ గా అర్థం అవుతుంది. తూగో,పగో జిల్లాల్లో ఇసుక ఆర్డర్ ను 20%, కడపలో 38%, విశాఖలో 20% వేగంగా తీర్చలేక పోయినట్టు నివేదిక తెలియజేస్తోంది.


నేడు వర్షాలు, వరదలు అధికం అయ్యాయి.రాష్ట్రంలో ప్రతి నదీ ప్రవాహంతో ఉరకలు వేస్తోంది. అలాంటప్పుడు నదుల్లోకి వెళ్లి ఇసుకను తెచ్చే పరిస్థితి అసంభవం ఇప్పటికే పదుల సంఖ్యలో వరదలు ముంచెత్తడంతో నదీతీరాలకు ఇసుక చేరవేయడం వీలు పడటం లేదు. నిండుకుండల్లా ఉన్న చెరువులు కుంటలు, కాల్వలు, చెరువులు నిండి ఇసుక తవ్వకానికి ఆటంకంగా ఉన్నాయంటున్నారు వైసీపీ నేతలు


వరద తగ్గుముఖం పట్టిన వెంటనే రీచ్ లు పెంచారు ఒక్క కృష్ణా నదివద్దే 10 ఇసుక రీచ్ లు, 10 డంపింగ్ యార్డులు గుర్తించారు. ప్రతి 15 రోజులకూ ఇసుకపై సమీక్ష చేసి అవసరం మేరకు అందుబాటులోకి తెస్తున్నారు మరోపక్క ఇసుక అక్రమ రవాణా అడ్డుకుంటున్నారు జిల్లాలు, రాష్ట్రాలు దాటకుండా చూసుకుంటున్నారు దీపావళి నాటికి ఇసుక కొరత పూర్తి స్థాయిలో తీరిపోతుందని అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: