ఇసుక సమస్యపై ఏపీలో మాటల యుద్ధం ముదురుతోంది. ప్రభుత్వం కృత్రిమ ఇసుక కొరత సృష్టిస్తుందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ కూడా ప్రభుత్వం చేతగాని తనం అంటూ విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణపై వైసీపీ నేతలు కూడా బాగానే స్పందిస్తున్నారు. ఎంత ఎగిరిపడినా వీరి విష ప్రచారాన్ని ప్రజలెవరూ విశ్వసించరని ఎమ్మెల్యే జోగి రమేష్‌ అన్నారు.


నదులు, కాల్వలు నిండుకుండలను తలపిస్తుంటే ప్రభుత్వం కృతిమ ఇసుక కొరతను సృష్టిస్తుందని చంద్రబాబు, పవన్‌ మాట్లాడడం సిగ్గుచేటన్నారు. అపారమైన అనుభవం ఉందని మాట్లాడే చంద్రబాబు.. కృత్రిమ ఇసుక కొరత సృష్టించే అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది..? ఇసుక తీయలేని స్థితిలో ఉంటే దాన్ని కృత్రిమ ఇసుకను సృష్టిస్తే ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందా..? కనీస జ్ఞానం కూడా లేకుండా పాడు ప్రతిపక్ష నేత చంద్రబాబు, రాజకీయ అజ్ఞాని పవన్‌ మాట్లాడుతున్నారని జోగి రమేశ్ మండిపడ్డారు.


గత ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన చంద్రబాబు విచ్చలవిడిగా ఇసుకను దోపిడీ చేశారు. చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట వద్ద రోజూ వందల లారీలు ఇసుక తరలిస్తుంటే రోజైనా కట్టడి చేశాడా..? వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంటే ఏ రోజు అయినా మాట్లాడాడా..? నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ బాబు ఇసుక దోపిడీకి రూ.100 కోట్ల జరిమానా విధించింది. ఈ పాపం చంద్రబాబుది కాదా..? దీనిపై సమాధానం చెప్పాలి..అంటూ జోగి రమేశ్ మండిపడ్డారు.


‘ఇసుకతో ఇబ్బందులు ఉన్నాయని అంగీకరిస్తున్నాం. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత వరుణ దేవుడు కరుణించాడు. పదేళ్లుగా లేని వర్షాలు ఇప్పుడు పడుతున్నాయి. ఇసుక కొరత తాత్కాలికమే. వరదలు తగ్గిన వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది. కార్మికుల పక్షాన నిలబడతామని చంద్రబాబు, పవన్‌ ఇప్పుడు సవతి తల్లి ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంది. ఏ వర్గానికి ఏ ఆపద వచ్చినా సీఎం వైయస్‌ జగన్‌ ఆదుకోవడానికి ముందుంటారు.. అని జోగి రమేశ్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: