ఏపీ మాజీ సీఎం చంద్రబాబు వ్యవహారశైలిపై వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తిరుపతిలోని వెంకటేశ్వర యూనివర్సిటీలో చదివే రోజు నుంచే విలువలు లేని రాజకీయాలు చేశారని గుర్తు చేశారు. పెట్టుబడులు పెట్టకుండా, వ్యాపారం చేయకుండా రాజకీయాల్లో లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు ఇవాళ నీతులు, విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.


రాజకీయ భిక్ష పెట్టిన కాంగ్రెస్‌ పార్టీని ఎన్‌టీ రామారావు పక్షాన చేరి ఎలా విమర్శించావో అందరికి తెలుసు అన్నారు.  ఆ తరువాత ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచింది కూడా చంద్రబాబే అన్నారు. దేశంలో అతి నీచమైన, నికృష్టమైన రాజకీయ కుట్రలకు, వంచనకు, దగాకు మారు పేరు చంద్రబాబే అని ధ్వజమెత్తారు. ఆ తరంలో నరకాసురుడైతే..ఈ తరంలో నారాసురుడని అభివర్ణించారు. గా, వంచన, మోసానికి చంద్రబాబు మారుపేరని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విమర్శించారు.


చంద్రబాబుకు విద్యార్థి దశ నుంచే కుల చిచ్చు పెట్టడం అలవాటైందని కోటంరెడ్డి తెలిపారు. లోకేష్‌కు తన నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదని, ముందు టీడీపీని చక్కదిద్దుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.  టీడీపీలో ఉంటే భవిష్యత్‌ ఉండదని భావించి చాలా మంది ఆ పార్టీని వీడి వేరే పార్టీలో చేరిపోతున్నారని కోటంరెడ్డి తెలిపారు.టీడీపీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కోటంరెడ్డి మండిపడ్డారు.


వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనను చూసి ఓర్వలేక టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. నిన్న చంద్రబాబు మాట్లాడుతూ..రాజకీయాల్లోకి ప్రజల కోసమే వచ్చానని చెప్పారని గుర్తు చేశారు. ఆయన ప్రజల గురించి ఆలోచించడం లేదని పేర్కొన్నారు. వ్యాపారాల పేరుతో చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించింది వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు జీవితమే ఒక వంచన అని విమర్శించారు. పిల్లనిచ్చిన ఎన్‌టీ రామారావు చంద్రబాబును ఉద్దేశించి మాట్లాడిన మాటలు నిజం కాదా అని ప్రశ్నించారు. మిమ్మల్ని జేబు దొంగ అన్నది నిజం కాదా అని కోటంరెడ్డి ప్రశ్నించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: