సంచలనం సృష్టించిన ఈఎస్ఐ
మందుల కొనుగోలు స్కాంలో సంచలన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. లేని మందులు కొనుగోలు చేసినట్లు రికార్డులు పుట్టించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కోట్ల రూపాయల
మందుల కొనుగోలు అక్రమాలపై ఇప్పడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న డిస్పెసరి నుంచి ఆసుపత్రుల వరకు కూడా ఈ స్కామ్ జరిగినట్లుగా తేలింది. ముఖ్యంగా ఎక్కడ ఉపయోగం లేని మందులను కూడా కొనుగోలు చేసింది. ఈఎస్ఐ స్కామ్ లో కొత్త ట్విస్ట్ ఏంటంటే అసలు ఫార్మా కంపెనీలు లేకుండానే మందులను కొనుగోలు చేశారు. ఈఎస్ఐ
మందుల స్కామ్లో అరెస్టయిన ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి లీలలు సైతం అదే రీతిలో వెలుగులోకి వస్తున్నాయి. డొల్ల కంపెనీలను నెలకొల్పి.. నేరుగా జువెలరీ షాపులకే డబ్బులను మళ్లించింది. అలాగే దండుకున్న డబ్బులతో ఆమె జల్సాలు చేసిన వీడియోలు వెలుగు చూశాయి. దేవికారాణి షెల్ కంపెనీలను అధికారులు గుర్తించారు.
ఈఎస్ఐ స్కామ్ లో ఫార్మా కంపెనీలు లేకుండానే మందులను కొనుగోలు చేశారు. 2016-18 మధ్యకాలంలో మహిధర్ మెడికల్ అండ్ సర్జికల్ నుంచి రూ.4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేసింది. అయితే వీటి వాస్తవ విలువ రూ.62 లక్షలే. మిగతా రూ.3 కోట్లకు పైగా సొమ్ము దేవికారాణి ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. వీటన్నింటి ఆధారాలను ఏసీబీ సంపాదించింది. జై సాయిరామ్ సంస్థ నుంచి మరో రూ. 4 కోట్ల విలువైన మందులు కొనుగోలు చేశారు. వీటి వాస్తవ విలువ కూడా రూ. 12 లక్షలుగా బయటపడింది. తేజా ఫార్మా నుంచి రూ.5.5 కోట్ల విలువైన మందులు కొనగా.. వీటి విలువ ఒక
కోటి 41 లక్షలుగా గుర్తించింది. అన్ని షెల్ కంపెనీల దగ్గర నుంచి మందులను కొనుగోలు చేశారని ఏసీబీ విచారణలో బయట పడింది. మొత్తం 8 షెల్ కంపెనీల ద్వారా రూ. 25 కోట్లకు పైగా మందులు కొనుగోలు చేసి డబ్బులు డ్రా చేసిందామె. ఈ
మందుల వాస్తవ విలువ 4 కోట్లు అయితే.. మిగతా సొమ్మును దేవికారాణి, నాగలక్ష్మి అకౌంట్లలో పడినట్లు అధికారులు గుర్తించారు. ఈఎస్ఐ స్కామ్లో తాజాగా తేజా ఫార్మా ఎండీ శ్రీనివాసరెడ్డిని ఏసీబీ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకూ ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల సంఖ్య 17కు చేరింది.
ఇక్కడే రూ. 5 కోట్ల విలువైన నగలను దేవికారాణి కొన్నట్లు అధికారులు ఆధారాలు సంపాదించారు. మిగతా సొమ్మును దేవికారాణి, నాగలక్ష్మి పంచుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. ఇలా అక్రమ మార్గంలో పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించిన దేవికారాణి చాలా జల్సా జీవితం గడిపినట్లు ఏసీబీ దర్యాప్తులో గుర్తించారు. దేవికారాణి చేతికి ఎముకే లేదన్నట్లుగా అవినీతి సొమ్మును ఖర్చుచేసింది. దోచుకున్న సొమ్ముతో పూర్తిగా ఎంజాయ్ చేసింది. లక్షలు వెచ్చింది బర్త్ డే పార్టీలు నిర్వహించింది. భారీ విల్లా కొనుగోలు చేసింది. పీఎంజీ వంటి అతిపెద్ద జువెలరీ షాపులో కోట్ల విలువైన నగలు కొనుగోలు చేసింది. ఇందుకు సంబంధించి.... ఇప్పుడు బయటకొచ్చిన ఆ వీడియోలు కలకలం రేపుతున్నాయి.