ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఇద్దరు స్నేహితులు సరదాగా ఒక పందెం వేసుకున్నారు. ఇద్దరు స్నేహితులలో ఒక వ్యక్తి అవతలి వ్యక్తితో 50 గుడ్లు తింటే 2000 రూపాయలు ఇస్తానని పందెం కాశాడు. 2000 రూపాయలకు ఆశ పడి అతని స్నేహితుడు ఒప్పుకున్నాడు. 50 ఉడకబెట్టిన గుడ్లను తీసుకొని తినటం మొదలుపెట్టిన ఆ వ్యక్తి 41 గుడ్లు తిన్న తరువాత స్పృహ తప్పి పడిపోయాడు. 
 
ఆ వ్యక్తి స్నేహితుడు ఆస్పత్రికి స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తిని తీసుకెళ్లగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్పృహ తప్పి పడిపోయిన వ్యక్తి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జైన్ పూర్ ప్రాంతంలోని బీబీగంజ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. బీబీగంజ్ నగర్ లో నివశించే సుభాష్ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగించేవాడు. సుభాష్ తన స్నేహితునితో ఎవరు ఎక్కువ గుడ్లు తింటారనే విషయం గురించి చర్చించాడు. 
 
సుభాష్ స్నేహితుడు 50 గుడ్లు తిని ఒక మద్యo బాటిల్ తాగితే 2000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. సుభాష్ పందేనికి అంగీకరించి 41 గుడ్లను అవలీలగా తినేశాడు. 42వ గుడ్డును తినబోతున్న సమయంలో సుభాష్ కింద పడిపోయాడు. మొదట సుభాష్ స్నేహితుడు సుభాష్ ను జిల్లా ఆస్పత్రికి తీసుకొనివెళ్లాడు. అక్కడ సుభాష్ ను పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించిందని లక్నోలోని ఆస్పత్రికి తీసుకొనివెళ్లాలని సూచించారు. 
 
లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో సుభాష్ ను చేర్చగా అక్కడ చికిత్స కు కోలుకోలేక సుభాష్ మృతి చెందాడు. చనిపోయిన సుభాష్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు నలుగురు కుమార్తెలు జన్మించారు. మొదటి భార్యకు కుమార్తెలే పుడుతూ ఉండటంతో సుభాష్ కుమారుడి కోసం కొన్ని నెలల క్రితం మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం  సుభాష్ రెండవ భార్య గర్భవతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: