వైస్సార్సీపీ కి అత్యంత సన్నిహితుడు అయిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ని ఏరికోరి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉంచుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి. 6 నెలలు కాక ముందే తిరుగుబాటు మొదలు అయింది. ఇప్పుడు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడింది . ఆయన్ను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియామకం. ఇంఛార్జ్ సీఎస్‌గా నీరబ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం.


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. సుబ్రహ్మణ్యంను ఆకస్మికంగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ ఉత్తర్వులు కూడా వెంటనే అమల్లోకి వస్తున్నట్లు జీవో వచ్చింది. సుబ్రహ్మణ్యంను గుంటూరు జిల్లా బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించారు. సీఎస్‌గా ఉన్న ఎల్వీ తన బాధ్యతలను తక్షణమే సీసీఎల్‌కే అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది.


సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చినందుకు ఎల్వీపై బదిలీ వేటు పడినట్లు చర్చ జరుగుతోంది. బిజినెస్ రూల్స్‌ను సవరిస్తూ.. ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జీవోపై సీఎస్ అభ్యంతరం తెలిపారు. సీఎంవో పీఎస్ విషయంలో సీఎస్ వైఖరిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. సీఎంవో ఉత్తర్వులు తప్పుపట్టడం సరికాదని భావించిన ప్రభుత్వ పెద్దలు.. తాజా పరిణామాలతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ చేసినట్లు తెలుస్తోంది.


అంతేకాదు.. షోకాజ్ నోటీసులు అందుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. అలాగే.. ఎల్వీ సుబ్రహ్మణ్యంక మరో ఐదునెలల సర్వీసు ఉండగానే బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. సుబ్రహ్మణ్యం సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌కు ముందు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా సీఎస్‌గా కొనసాగుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: