పవన్ కళ్యాణ్.. ఒకప్పుడు సినీ పవర్ స్టార్ ఇప్పుడు కూడా పవర్ స్టార్ ఏ లెండి. కానీ ఇప్పుడు పవర్ స్టార్ కంటే జనసేన అధినేత అనేదే పెద్దది. రాజకీయాలలోకి అడుగు పెట్టి మొదట చంద్రబాబుకు మద్దతు ఇచ్చి ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టి.. పోటీ చేసిన రొండు చోట్ల అతి ఘోరంగా ఓడిపోయి.. 175 స్థానాల్లో జనసేన సంపూర్ణంగా పోటీ చేస్తే పార్టీ మొత్తానికి ఒకేఒక ఎమ్మెల్యే గెలిచాడు.


అయితే అతి ఘోరంగా ఓడిపోయినా పవన్ కళ్యాణ్ రెండు నెలలకోసారి ఆంధ్రని పలకిరిస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే మొన్న ఆదివారం భవన కార్మికుల ఆత్మహత్యలకు నిరసనగా విశాఖలో లాంగ్ మార్చ్ నిర్వహించాడు. కానీ ఏమి సాధించలేకపోయారు అది వేరే విషయం. అయితే ఈరోజు మాత్రం వైసీపీ ప్రభుత్వంపై, రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.   


నేడు విశాఖపట్నంలో జనసైనికులతో సమావేశమైన పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్ పై మండిపడ్డారు. పులివెందులలో రాజధానిని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని వ్యాఖ్యానించారు.. అయితే ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు, నెటిజన్లు ఫైర్ అవుతున్న సంగతి తెలిసిందే. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్ ని కూడా సరిగ్గా చెప్పలేవు నువ్వు మాట్లాడుతావా అంటూ ఫైర్ అవుతున్నారు. 


ఈ నేపథ్యంలోనే కత్తి మహేష్ పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ''ఏరా పవన్ కళ్యాణ్ అంటూ ఆయన పరుషమైన పదజాలాన్ని వాడారు. ‘‘ఏరా పవన్ కళ్యాణ్... పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!'' అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.  


కాగా ఈ పోస్ట్ పై మహేష్ కు ఏంటి ఈ భాష అంటూ కొందరు ప్రశ్నిస్తే ''పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యతలేని బరితెగించి బానిసకు ఇంతకుమించిన మంచి భాష నా దగ్గరలేదు. నిజానికి నేను చాలా మర్యాదగానే ఇప్పటికి రాస్తున్నా. మీరు చిత్తగించాలి'' అని మహేష్ స్పందించాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: