పవన్ కల్యాణ్ కూ కత్తి మహేశ్ కూ ఉన్న వైరం సంగతి తెలిసిందే. అసలు పవన్ కల్యాణ్ ను తిట్టడం ద్వారానే కత్తి మహేశ్ ఫేమస్ అయ్యాడనే వారూ ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా కత్తి మహేశ్ పవన్ కల్యాణ్ జోలికి రావడం లేదు. తాజాగా పవన్ కల్యాణ్ ఏపీ రాజధాని గురించి .. జగన్ కేసు గురించి చేసిన వ్యాఖ్యలతో మళ్లీ కత్తి మహేశ్ రంగంలోకి దిగాడు.


ఏపీ రాజధాని గురించి పవన్ మాట్లాడుతూ.. రాజధాని పులివెందులకు తరలించకుకోండి.., హైకోర్టు కర్నూలుకు తీసుకెళ్లండి.. మీకు కోర్టుకు వెళ్లడానికి ఖర్చు తగ్గుతుంది అంటూ జగన్ ను ఉద్దేశించి వెటకారం చేశారు. ఈ కామెంట్లు వివాదాస్పదమయ్యాయి. ఇప్పుడు కత్తి మహేశ్ వాటిపైనే స్పందించాడు.


ఏరా పవన్ కళ్యాణ్ అని ఆయన సంభోదిస్తూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. పుండాకోర్, మళ్లీ గుండు కావాలా? అంటూ పరుషమైన పదజాలాన్ని వాడారు.. ‘‘ఏరా పవన్ కళ్యాణ్... పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!’’ అని కత్తి మహేశ్ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు.


ఆయన కామెంట్లపై నెటిజన్లు కూడా పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇదేం భాష మహేష్.. ఇలా మాట్లాడకు అని ఓ నెటిజన్ సూచించాడు. అయితే కత్తి మాత్రం.. ‘‘పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యతలేని బరితెగించి బానిసకు ఇంతకుమించిన మంచి భాష నా దగ్గరలేదు. నిజానికి నేను చాలా మర్యాదగానే ఇప్పటికి రాస్తున్నా. మీరు చిత్తగించాలి’’ అంటూ బదులిచ్చాడు. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం రాయలసీమకు రాజధాని రావాల్సిన విషయాన్ని కత్తి మహేశ్ గుర్తు చేశాడు.


అంతే కాదు.. పవన్ విశాఖ సభలో చేసిన వ్యాఖ్యల పట్ల స్పందిస్తూ.. ‘‘ఇప్పటి వరకూ.. తీస్తా తీస్తా అనడమేగాని, వాడు తీసిన తాటా లేదు. తోలూ లేదు. తొక్కా లేదు. చిల్ చిల్. ఆల్రెడీ వాడిగా గుండు ఒకసారి. వేడిగా ఓటమి రెండుసార్లు తగిల్చి జనాలే తేల్చేశారు. ఇక ఆపమనండి ఈ మాడా యవ్వారాలు!’’ అంటూ కత్తి మహేశ్ ఘాటుగా స్పందించాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: