చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటేసిన తీరు సర్వత్రా ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేసేదిగా ఉంది. నిస్వార్థంగా, డ్యూటీకి కట్టుబడి ఉండే అధికారిగా ఎల్వీ సుబ్రమణ్యానికి మంచి పేరుంది. ఎవరూ ఊహించని విధంగా జరిగిన ఈ విపరిణామం వైఎస్
జగన్మోహన రెడ్డి తీరుపై నీలి మేఘాలు కమ్మేలా చేసింది. విధి నిర్వహణలో ఆయన ఖచ్చితంగా ఉంటూ, మొహమాటాలకు తావుండని ఆయన తీరు తొలిదశలో వైసీపి ప్రత్యేకించి
జగన్ అధికారంలో కుదురుకోవటానికి సహాయ పడింది. అయితే అదే ఖచ్చితత్వం అవకాశవాద రాజకీయం, క్రిష్టియన్ మతాభిమానం
జగన్ లో నిద్ర లేవగానే - నచ్చినట్లుగా లేదు.
ముఖ్యంగా ఇటీవల తిరుమలలో అన్యమత ఉద్యోగులు చేరి, కలసి కట్టుగా సిఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తీరుపై తీవ్ర వ్యతిరేఖతతో ఉన్నారు. టిటిడిలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను బదిలీ చేయాలని సిఎస్గా ఎల్వీ సుబ్రమణ్యం గట్టిగానే ప్రయత్నం చేశారు. అయితే వీరంతా జగన్తో తమ గోడు వెళ్ల బోసుకున్నారన్న వార్తలు కూడా ఉన్నాయి.
ప్రవీణ్ ప్రకాశ్కు షోకాజ్ నోటీస్ ఇవ్వడంపైకి కనిపిస్తున్న వ్యవహారమే అయినా
తిరుమల వ్యవహారమే అంతర్గతంగా ఉందన్న ప్రచారం ఉంది. మొత్తంగా ఎల్వీని బదిలీ చేసిన తీరుమాత్రం అవమాన కరంగా ఉందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనను తప్పించాలను కుంటే వ్యక్తిగతంగా చర్చించి సామ దాన భేధాలను వైఎసార్ లాగా ప్రదర్శించవచ్చు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరిని నియమించుకోవాలో
ముఖ్యమంత్రి కున్న విశేష అధికారం కావచ్చు. అలాగే ఏయే శాఖలకు ఎవరెవరు కార్యదర్శులుగా ఉండాలో ముఖ్యమంత్రే స్వయంగా నిర్ణయించుకోవచ్చు. “ముఖ్యమంత్రి కార్యాలయం” లో కార్యదర్శులకు, ముఖ్య కార్యదర్శులుగా, ప్రత్యేక కార్యదర్శులుగా ఎవరు ఉండాలన్నది కూడా
ముఖ్యమంత్రి కున్న విశేష అధికారాల్లో ఒకటి.
కొన్ని విషయాల్లో సిఎస్, ఎల్వీ సుబ్రమణ్యం సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇష్టానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని సమాచారం. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యంపై బదిలీ వేటు పడిందన్న ప్రచారం సాగుతోంది. ఆయన్ను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి విభాగానికి డైరెక్టర్ జనరల్గా బదిలీ చేశారు ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ సోమవారం జారీ చేసిన ఉత్తర్వులు కలకలం రేపాయి.
నూతన తాత్కాలిక సిఎస్ గా భూపరిపాలనా శాఖ ప్రధాన కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్ను నియమించిన ప్రభుత్వం ఎల్వి సుబ్రహ్మణ్యంను తక్షణమే బాధ్యతల నుండి వైదొలగాలని ఈ ఉత్తర్వుల్లో ఆదేశించింది. మరో ఐదు నెలల్లో ఉద్యోగ విరమణ చేయనున్న సిఎస్ ఎల్వీని అనూహ్యంగా ఏమాత్రం ప్రాధాన్యత లేని పోస్టుకు మార్చడం, తక్షణమే బాధ్యతల నుండి తప్పు కోవాలని ఆదేశించడం వంటి చర్యలు చర్చనీయాంశంగా మారాయి.
కొద్దిరోజుల క్రితం ఏ అధికారి కైతే సిఎస్ హోదాలో ఎల్వి సుబ్రహ్మణ్యం షోకాజ్ నోటీస్ జారీ చేశారో, ఆ అధికారి పేరుతోనే తాజా బదిలీ ఆదేశాలు వెలువడటం విశేషం. ఒక ప్రతిపాదన తనకు తెలియ చేయకుండా
మంత్రి మండలి సమావేశం ముందుకు తీసుకు రావడంపై సాధారణ పరిపాలనశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్కు ఎల్వి సుబ్రహ్మణ్యం ఈ నెల ఒకటో తేదిన నోటీస్ జారీచేశారు.
‘సిఎస్ ఆమోదం లేకుండా కేబినెట్ అజెండాలో అంశాలను ఎలా చేరుస్తారు? ఇది బిజినెస్ రూల్స్కు విరుద్దం. దీనిపై 15 రోజుల్లో వివరణ ఇవ్వండని ఈ నోటీస్లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రికి తెలియకుండా ఈ షోకాజ్ నోటీస్ జారీ కావడంపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. దీంతో తక్షణమే ఆయన బదిలీ జరిగిందని కూడా అంటున్నారు. దీంతో అధికారుల్లోనూ, ఇటు రాజకీయ పార్టీల నేతల్లోనూ చర్చ మొదలైంది. షోకాజు నోటీసు ఇచ్చిన వెంటనే బదిలీ చేయడమంటే అధికారుల మానసిక స్థయిర్యాన్ని దెబ్బతీయడమేనని ఉన్నతాధికారులు చెబుతు న్నారు.
కేంద్ర సర్వీసులో ఉన్న నీలం సహాని సోమవారం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆమెను సిఎస్గా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆమె మాజీ
ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి అత్యంత అనుకూలురని చెబుతున్నారు. ప్రసుత్తం సామాజిక న్యాయశాఖలో కార్యదర్శిగా ఉన్నారు. ఎల్వీని తక్షణమే రిలీవ్ కావాలన్న ప్రభుత్వం, సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించింది. మరో 5 నెలల సర్వీసు మాత్రమే మిగిలి ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఎన్నికలకు ముందు అప్పటి సీఎస్ అనిల్చంద్ర పునేటాను తప్పించిన
ఈసీ, ఎల్వీకి బాధ్యతలు అప్పగించింది.
అనంతరం అధికారంలోకి వచ్చిన
జగన్ నాయకత్వంలోని వైసీపి ప్రభుత్వం, ఎల్వీ సుబ్రమణ్యాన్ని సీఎస్గా కొనసాగించింది.
సీబీఐ కేసుల్లో “జగన్కి ఎల్వీకి లింకు” లున్నాయంటూ ప్రతిపక్షం నుండి విమర్శలు వచ్చినా, సీఎస్గా కొనసాగించారు. అలాంటిదిప్పుడు సడన్గా ఎల్వీ సుబ్రమణ్యంపై బదిలీ వేటేయడంతో అధికార వ్యవస్థ అంతా షాక్ కు గురైంది. జనానికి ఇది దిగ్భ్రమ కలిగించింది. విశ్లేషకుల ఆలొచనలకు విశ్లేషణలకు అందలేదు. అయితే, ఎల్వీపై బదిలీ వేటేయడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. క్రిష్టియన్ మతావలభకులు
జగన్ కు టిటిడిలో అన్యమత ప్రమేయం వ్యవహారంలో చేసిన పిర్యాదులు
జగన్ మనసులో చెలరేగుతున్న మత పిచ్చికి ఆజ్యం పోసిందని అంటున్నారు.
సీఎస్ బదిలీ తరవాత చర్చీలలో ఆనంద హర్షాతి రెఖాలతో పండగ చేసుకున్నరని వార్తలు వచ్చాయి. దాంతో వెదకబోయిన తీగ కాలికే చుట్తుకొన్నట్లు - జీఏడీ పొలిటికల్ సెక్రటరీ, సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ – వ్యవహారం ఆధారం చేసుకొని పని ముగించేశారని అంటున్నారు. అంటే ఎల్వీ శుబ్రమన్యం - ప్రవీణ్ రకాష్ మధ్య తలెత్తిన విభేదాలు, ఆధిపత్యపోరు కలగలిసి జగన్లో అప్పటికే కుతకుత లాడుతున్న క్రిష్టియం సమాజ పిర్యాదులకు ఆకస్మిక బదిలీకి ఆజ్యం పోశాయని అంటున్నారు కారణమని బ్యూరోక్రసీ అంతటా గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాను తీసుకునే నిర్ణయాలకు అంగీకారం తెలపకుండా పలు సందర్భాల్లో ఆఫీస్ నోట్స్ ను తిప్పిపంపుతున్న ఎల్వీపై సీఎం జగన్ చాలా కాలంగా ఆగ్రహంగా ఉన్నారని అంటున్నారు. ఇప్పుడు ప్రచారంలో ఉన్న 'ఎల్వీ - ఆరెసెస్' సంబంధాలు దరిమిలా సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి కష్టకాలం దాపురించినట్లేననే సమాచారం విని పిస్తుంది. గతంలో వైఎసార్ పాలనకు గుడ్డిగా "యెస్" అన్నట్లు ఇప్పుడు "ఐఏయెస్" లు ఇక
జగన్ ఆదేశాలకు "అయ్యా! యెస్" అనబోరని కూడా తెలుస్తుంది.
అధికారుల పట్ల
జగన్ కఠినంగా ఉంటే అధికారులు చట్టప్రకారం వ్యవహరించటం మొదలెడితే – ఇక
జగన్ అధికారానికి, రాజకీయానికి “టగ్ ఆఫ్ వార్” తప్పదని ఇప్పటికే గోడ మీద పిల్లిలా పొంచి చూస్తున్న ప్రతిపక్ష నాయకునికి ఆయన
మీడియా సైన్యానికి సూది మొనంత సందిస్తే చాలు దాన్ని "మహారంధ్రం" చేయటాని కి ఎంతో సమయం పట్టదని అంటున్నారు. అంతా తన కనుసన్నలలో జరగాలన్న
జగన్ భావనకు అంత్యకాలం దాపురించినట్లే. ఇంత మెజారిటీ తో గెలిచినా మెజారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతింటే మాత్రం,
జగన్ నాయకత్వానికి చిక్కులు తప్పవనే అంటున్నారు.