ఆంధ్ర ప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాలు అన్ని అందరికి అమలు అయ్యేలా ముఖ్యమంత్రి చూస్తున్నారు. ప్రతి పేదోడి ముఖంలో చిరునవ్వే లక్ష్యంగా వైఎస్ జగన్ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం నియంత్రణ వైపు అడుగులు వేశారు. 

                                

అయితే మద్యం నియంత్రణ విధానంలో మరో కీలక నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నారు. రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం జనవరి 1 నుంచి అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని, బార్లకు అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్త వహించాలని అన్నారు. 

                             

అయితే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం లభ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయాలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష నిర్వహించారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం, ప్రస్తుత పరిస్థితులను అధికారులకు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నేపథ్యంలోనే ఈ మద్యం నియంత్రణ విధానంలో మరో కీలక అడుగు ముందుకు వేశారు. 

                                

మరింత సమాచారం తెలుసుకోండి: