ఆమె సాంప్రదాయబద్దంగా కనపించే ఓ గృహిణి.. చూడటానికి పద్దతిగా కనిపించే మహిళ. కానీ ఆమెలోని అసలు మనిషి మాత్రం కామ పిశాచి.. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని మూడో పెళ్లితో సెటిలైంది. ఆ తర్వాత మగాడిలా వేషధారణ వేసుకుని బాలికలను ఆకర్షిస్తోంది. మగాడిలా ప్రేమలేఖలు రాస్తూ బాలికలను బుట్టలో వేసుకుంటోంది.
అంతేనా.. వారిని ఇళ్లకు తీసుకొచ్చి.. అసహజ లైంగిక చర్యలు చేస్తోంది. పాపం.. ఇదంతా తెలియని భర్త.. ఒక్కసారిగా గుట్టు రట్టయ్యే సరికి.. ఏకంగా పెంట్ హౌస్ నుంచి దూకేశాడు.. ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఇంటిని సోదా చేస్తే కళ్లుతిరిగే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. ఏదో సినిమా స్టోరీలా ఉంది కదా.. కానీ ఇదంతా వాస్తవం.
ఒంగోలులో పెంట్ హౌస్ నుంచి దూకిన ఘటన వెనుక మృతుడి భార్య పాత్ర పోలీసులకే షాక్ ఇస్తోంది. భార్య చేసిన సిగ్గుమాలిన పని పోలీసులకు తెలియడం అవమానంగా భావించిన భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కేసు దర్యాప్తులో షాకింగ్ వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. పోలీసులు నిందితురాలు సుమలత కాల్డేటా పరిశీలించడంతో కామ పిశాచి గుట్టు రట్టవుతోంది.
ఈనెల 4వ తేదీన తనకు మత్తు ఇచ్చి కొందరు లైంగిక దాడి చేశారంటూ 17 ఏళ్ల బాలిక స్పందనలో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కామ పిశాచి రాసలీలలు వెలుగు చూస్తున్నాయి. బుధవారం ఏడుకొండలు ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఓ బ్యాగులో కృత్రిమ జననాంగాలను పోలిన వస్తువులు కనిపించాయి. మగరాయుడిలా కనిపించేందుకు సుమలత ధరించే దుస్తులు, లైంగిక చర్యకు ఉపయోగించే కృత్రిమ పరికరం, నడుముకు చుట్టుకునే బెల్టు వంటివి పోలీసులకు దొరికాయి.
తమకు ఫిర్యాదు ఇచ్చిన మైనర్ను ట్రాప్ చేసి మగ వేషంలో లైంగిక దాడికి పాల్పడింది కూడా సుమలతగానే పోలీసులు నిర్దారణకు వచ్చారు. సమలత కాల్ డేటాలో ఆమె అనేక మంది మైనర్లను ట్రాప్ చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో ఇంకెన్ని అంశాలు వెలుగుచూస్తాయో మరి.