అమెరికాలో మ‌నోళ్లు మ‌రో ప్ర‌త్యేక‌త‌ను సాధించారు. ఒక‌రు కాదు ఇద్ద‌రు కాదు..ఏకంగా న‌ల‌గురు భారత సంతతి వ్యక్తులు అక్క‌డి స్థానిక సంస్థ ఎన్నికల్లో విజయం సాధించారు. సెనెటర్లుగా ఎన్నికైన వారిలో కమ్యూనిటీ కాలేజ్‌ ప్రొఫెసర్‌ గజాలా హష్మీ, మాజీ వైట్‌హౌస్‌ అధికారి సుహాస్‌ సుబ్రహ్మాణ్యం, తమిళనాడు రాష్ట్రానికి చెందిన రిసెర్చ్‌ స్కాలర్‌ ప్రవాస భారతీయుడు రాజు, డింపుల్‌ అజ్మీరా ఉన్నారు. 


అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు టెక్నాలజీ పాలసీ సలహాదారుగా పనిచేసిన సుహాస్ సుబ్రమణ్యం వర్జీనియా స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటీవ్‌గా ఎన్నికయ్యారు. ఆయన భారత సంతతికి చెందిన వారి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న లౌదన్ అండ్ ప్రిన్స్ విలియమ్ జిల్లా నుంచి పోటీ చేసి గెలిచారు. బెంగళూరుకు చెందిన సుబ్రమణ్యం కుటుంబం 1979లో అమెరికాకు వలస వెళ్లింది. ఉత్తర కాలిఫోర్నియాలోని ఛార్టోటీ సిటి కౌన్సిల్‌కు డింప్లీ అజ్మీరా, కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాసిస్‌కో పబ్లిక్ డిఫెండర్‌గా మూ రాజు ఎన్నికయ్యారు.


ఇక హైదరాబాద్‌కు చెందిన ఘజాల హష్మీ (మున్నీ) చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. వర్జీనియా రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా, తొలి భారత సంతతి మహిళగా రికార్డులు సృష్టించారు. డెమోక్రటిక్ పార్టీకి చెందిన హష్మీ రిపబ్లికన్ పార్టీ సెనేటర్ గ్లిన్ స్టర్టివాంట్‌ను ఓడించడంతో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. ఎమోరీ యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ పట్టా పొందిన ఆమె దాదాపు 25 ఏళ్ల‌పాటు వర్జీనియాకు చెందిన కాలేజీ అండ్ యూనివర్సిటీ సిస్టమ్‌లో లీడింగ్ ఎడ్యుకేటర్‌గా సేవలందించారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆమెను అభినందించారు. తనను గెలిపించిన ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తానని, తుపాకుల సంస్కృతికి వ్యతిరేకంగా పోరాడుతానని, విద్య, వైద్యరంగాల అభివృద్ధికి కృషి చేస్తానని హష్మీ చెప్పారు.వరైతే వర్జీనియాలో ప్రగతిశీల మార్పును కోరుకుంటున్నారో.. ఎవరైతే తమ తరఫున గొంతుకను వినిపించాలని నన్ను ఎన్నుకున్నారో వారందరికీ ఈ విజయాన్ని అంకితం చేస్తున్నాను అని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: