ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిన
భార్య ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది ఆ ఇల్లాలు . నల్లగొండ
జిల్లా కొండమల్లేపల్లి మండలం చింత చెట్టు తండా లో ఈ ఘటన
అక్టోబర్ 29న జరిగింది. చింత చెట్టు తండాకు చెందిన నేనావత్ రమేష్, స్వప్న దంపతులు . వీరు జీవనోపాధి కోసం
హైదరాబాద్ కు వలస వెళ్లారు.
సూర్యాపేట జిల్లా మునగాల కు చెందిన నాగరాజు, రమేష్ ఇద్దరు కలిసి ఒకే అపార్ట్ మెంట్ లో
వాచ్ మెన్ గా పని చేసేవారు . రమేష్ ఇంటికి తరుచూ నాగరాజు వచ్చి , వెళ్తూ ఉండేవాడు .
రమేష్
భార్య స్వప్న కి నాగరాజు తో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్ పలుమార్లు స్వప్నను హెచ్చరించినా , ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతు ఉండేవి . ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది స్వప్న. నాగరాజు తో కలిసి పక్కా
ప్లాన్ వేసి
భర్త ను హతమార్చింది.
దీపావళి పండుగ కు స్వ గ్రామానికి వచ్చిన రమేష్ కు పెరుగులో మత్తు మాత్రలు కలిపి , ఆ పెరుగును తాగించింది . అతడు నిద్రలోకి జారుకోగానే , ప్రియుడు నాగరాజు
ఫోన్ చేసి తమ తండా కు రప్పించుకుంది స్వప్న . నిద్రలో ఉన్న రమేష్ కాళ్లను స్వప్న పట్టుకోగా, నాగరాజు ఒక వైరుతో అతడి గొంతుకు ఊరిపోసి
హత్య చేశాడు .
మద్యం మత్తులో రమేష్ చనిపోయాడని గ్రామస్తులు నమ్మించింది స్వప్న. గ్రామస్థులు స్వప్న మాటలు నమ్మి రమేష్ అంత్యక్రియలు కూడా నిర్వహించారు . రమేష్ గొంతు పై గాయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అనుమానం వచ్చి డెడ్ బాడీ ఫోటోలు తీశాడు. దాన్ని రమేష్ సోదరుడికి చూపించాడు . దానికితోడు స్వప్న ప్రవర్తనపై అనుమానం రావడంతో
నవంబర్ 5న రమేష్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు . దీనితో పోలీసులు స్వప్న ను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.