ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య ఉదంతం ఆలస్యంగా  వెలుగు చూసింది.  ప్రియుడితో కలిసి భర్తను దారుణంగా హతమార్చింది ఆ ఇల్లాలు .   నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చింత చెట్టు తండా లో ఈ ఘటన  అక్టోబర్ 29న జరిగింది.  చింత చెట్టు తండాకు చెందిన నేనావత్ రమేష్,  స్వప్న దంపతులు . వీరు జీవనోపాధి కోసం హైదరాబాద్ కు  వలస వెళ్లారు.  సూర్యాపేట జిల్లా మునగాల కు చెందిన నాగరాజు,  రమేష్ ఇద్దరు కలిసి ఒకే అపార్ట్ మెంట్  లో వాచ్ మెన్  గా పని చేసేవారు .  రమేష్ ఇంటికి తరుచూ  నాగరాజు వచ్చి , వెళ్తూ ఉండేవాడు .

  రమేష్ భార్య స్వప్న కి నాగరాజు తో   ఏర్పడిన పరిచయం కాస్తా    వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ  విషయం తెలుసుకున్న రమేష్ పలుమార్లు స్వప్నను  హెచ్చరించినా ,  ప్రయోజనం లేకుండా పోయింది.  ఈ విషయమై భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతు ఉండేవి .  ఈ నేపథ్యంలో ప్రియుడితో కలిసి భర్తను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది  స్వప్న. నాగరాజు తో కలిసి  పక్కా ప్లాన్ వేసి భర్త ను  హతమార్చింది.  దీపావళి పండుగ కు స్వ గ్రామానికి వచ్చిన రమేష్ కు పెరుగులో మత్తు మాత్రలు కలిపి , ఆ పెరుగును తాగించింది . అతడు  నిద్రలోకి జారుకోగానే ,  ప్రియుడు నాగరాజు ఫోన్ చేసి తమ తండా కు రప్పించుకుంది స్వప్న . నిద్రలో ఉన్న రమేష్ కాళ్లను స్వప్న పట్టుకోగా,  నాగరాజు ఒక వైరుతో అతడి గొంతుకు ఊరిపోసి హత్య చేశాడు .

  మద్యం మత్తులో రమేష్  చనిపోయాడని గ్రామస్తులు నమ్మించింది స్వప్న.  గ్రామస్థులు స్వప్న మాటలు నమ్మి  రమేష్ అంత్యక్రియలు కూడా నిర్వహించారు .  రమేష్ గొంతు పై గాయాన్ని  గుర్తించిన ఓ వ్యక్తి అనుమానం వచ్చి డెడ్ బాడీ ఫోటోలు తీశాడు. దాన్ని రమేష్  సోదరుడికి చూపించాడు . దానికితోడు  స్వప్న ప్రవర్తనపై అనుమానం రావడంతో నవంబర్ 5న రమేష్ సోదరుడు  పోలీసులకు ఫిర్యాదు చేశాడు . దీనితో  పోలీసులు స్వప్న ను  అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: