ఈ మధ్యకాలంలో నిరుద్యోగులకు శుభవార్త మీద శుభవార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉద్యోగాలు కేంద్రంలో ఉద్యోగాలు ఇలా ఎక్కడ పడితే అక్కడ నోటిఫికేషన్ పడి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది. అయితే ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో జగన్ అన్న నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగా ప్రస్తుతం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

                      

ఇంకా విషయానికి వస్తే.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ & ఆర్డినెన్స్ ఎక్విప్‌మెంట్ ఫ్యాక్టరీల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదోతరగతి, ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

                        

అయితే ఈ పోస్టుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 4805 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఐటీఐ క్యాటగిరిలో 3,210 పోస్టులు, నాన్-ఐటీఐ క్యాటిగిరిలో 1595 పోస్టులు ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు అర్హత నాన్-ఐటీఐ క్యాటగిరికి కనీసం 50 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో కనీసం 40 శాతం మార్కులు ఉండాలి. ఐటీఐ క్యాటగిరికి సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.


అయితే ఈ పోస్టులకు దరఖాస్తు గడువు ముగిసే సమయానికి అభ్యర్థుల వయసు 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. కాగా ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల కానుంది. డిసెంబర్ చివరి వారానికి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: