బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్‌ వద్ద బెంగళూరు-చిత్తూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపుతప్పిన ఓ కంటైనర్ భారీ బీభత్సం సృష్టించింది. డివైడర్ ను దాటి మరీ ఆటో, వ్యాన్, బైక్ మీదకు దూసుకుపోయి మరుభూమిని తలపించేలా మరణ మృదంగాన్ని మోగించింది.. వాటర్ బాటిల్స్ లోడుతో వెళ్తున్న కంటైనర్ బ్రేకులు ఫెయిలై డివైడర్‌ దాటి వెళ్లి ఎదురుగా వస్తున్న ఓ ఆటో, ఓమ్నీ వ్యాన్‌, మరో బైక్‌పైకి దూసుకెళ్లింది.


ఏం జరుగుతుందో తెలిసేలోపే ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో 12 మంది దుర్మరణం చెందారు. వారిలో బంధువు చనిపోతే పరామర్శకు వెళ్లి వస్తున్న కుటంబం తో పాటు బైక్‌పై పని మీద బయటకు వెళ్లిన ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఆటో నుజ్జు నుజ్జు అయింది. ఇక అత్యంతగా విషాదకరమైన నిజం ఏంటంటే మృతుల్లో మరణించిన  8 మంది ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం..


ఇక ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు మహిళలున్నారు.  ఇకపోతే మరణించిన వారిలో కంటైనర్‌ డ్రైవర్‌ కూడా ఉండగా, కంటైనర్‌ క్లీనర్‌ తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలన్నీ ఛిద్రమవడంతో గుర్తించడం కష్టంగా మారింది. ఇక ప్రమాద విషయం తెలుసుకున్న చిత్తూరు కలెక్టర్ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఇక కుటుంబంలోని 8 మంది ప్రమాదంలో చనిపోవడంతో మర్రిమాకుల పల్లెలో విషాదం అలముకుంది.. గంగవరం మండలం మర్రిమాకులపల్లెకు చెందిన రెడ్డి శేఖర్ కుటుంబం, తమకు సంబంధించిన  బంధువు చనిపోవడంతో పరామర్శించేందుకు ఓమ్నీ వాహనంలో బయలుదేరి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.


కంటైనర్ మీదికి  దూసుకురావడంతో కారులోని 8 మంది అక్కడికక్కడే మరణించినట్లు సమాచారం. చనిపోయిన వారిలో రామచంద్ర(50), రాము(38), సావిత్రమ్మ(40), ప్రమీల(37), గురమ్మ(52), సుబ్రహ్మణ్యం(49), శేఖర్(45), పాపమ్మ(49) చనిపోయినట్లుగా గుర్తించారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: