తెలంగాణ, ఏపీ పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లోని సున్నిత, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు అన్ని కమిషనరేట్లు, ఎస్పీ కార్యాలయాలకు చెందిన పోలీసులు అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని పీస్‌ కమిటీలు, బస్తీ సంఘాలు, వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహించారు.


ఇంత హడావుడి పోలీసులు ఎందుకు చేస్తున్నారు అంటే ఈ రోజు అనగా అయోధ్య అంశంపై శనివారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఎలాంటి భావోద్వేగాలకు, ఆవేశాలకు లోను కావద్దని, తీర్పు ఎలా వచ్చినా.. గౌరవించాల్సిందేనని పోలీసులు సృష్టం చేస్తున్నారు.


ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు నగరంలో గాని రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగకుండా హై అలర్ట్‌ ప్రకటించారు.. ఇకపోతే అనుమానితులు, నేరచరిత గల వారిపై గట్టి నిఘా ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పికెటింగ్‌లు ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఇకపోతే నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదనే ఉత్తర్వులు వెలువడ్డాయి. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానిత ప్రాంతాలకు  అవసరమైన, వాటర్‌ కెనన్లు, వజ్ర వాహనాలను తరలించనున్నారు.


మరీ ముఖ్యంగా నిజామబాద్, ఆదిలాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్, మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాల్లో నిఘా వర్గాలు రంగంలోకి దిగాయి.  ఇదేకాకుండా డీజీపీ కార్యాలయం నుండి అధికారులూ అయోధ్య కేసులో తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకుగాను ఎక్కడికక్కడ ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు..


డీజీపీ గౌతం సవాంగ్‌ ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారట. అవాంఛనీయ ఘటనలు తలెత్తినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అన్ని వర్గాలా పోలీసు అధికారులకు సూచించారట. ఇకపోతే ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాల్లో ఏ వర్గాన్నీ కించపరిచేలా కామెంట్పోస్టులు, వీడియోలు పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే సోషల్‌ మీడియాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారట..


మరింత సమాచారం తెలుసుకోండి: