ఆర్టీసీ బంద్ వల్ల తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు. ఇప్పటికే ఆర్టీసీ విషయంలో హై కోర్ట్ చేత ప్రభుత్వం నానా మాటలు పడాల్సి వస్తుంది. అయినా కేసీఆర్ తన ఈగో ను తగ్గించుకోకుండా మొండిగా సాగిపోతున్నారు. దాదాపు ఐదు వారాలకు దగ్గర పడుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో సీఎం వ్యవహరిస్తున్న ఇగో.. ఆయనకు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది.  శాఖల పరంగా సమీక్షలకు దూరంగా ఉంటే సీఎం కేసీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా దాదాపు 14 సమీక్షల్ని నిర్వహించారు.కార్మికులు సమ్మెకు ప్రారంభంలో మొదలైన సమీక్షల పర్వం ఇప్పటివరకూ పెద్ద ఎత్తున సాగుతోంది. ఒక అంశం మీద సీఎం హోదాలో కేసీఆర్ ఇన్నేసి సమీక్షలు నిర్వహించటం ఇదే తొలిసారి అంటున్నారు.


 కేసీఆర్  ఎన్ని సమీక్షలు నిర్వహించిన సమస్యకు పరిష్కారం మాత్రం దొరకటం లేదు. తాజాగా హైకోర్టు వ్యాఖ్యలు చూసిన తర్వాత అయినా ప్రభుత్వం కాస్తంత ఔదార్యం ప్రదర్శించాల్సిన అవసరం ఉందన్న మాట వినిపించక మానదు. ఆర్టీసీ ఇష్యూలో కేసీఆర్ ఇప్పటివరకూ వెచ్చించిన సమయం ఏకంగా 44 గంటలు కావటం గమనార్హం. ముఖ్యమంత్రి హోదాలో 14 సమీక్షలు నిర్వహించి.. 44 గంటల సమయాన్ని వెచ్చించటంతో పాటు ఒక కలెక్టర్ల సదస్సును నిర్వహించినప్పటికి ఫలితం మాత్రం సానుకూలంగా లేకపోగా.. కోర్టు నుంచి ఇబ్బందికర వ్యాఖ్యలు వినాల్సిన పరిస్థితి.


ఇటువంటి పరిస్థితికి కారణం కేసీఆర్ మొండి తనం .. లేనిపోని పట్టుదలకు పోవటమేనని చెప్పాలి. పంతాన్ని నెరవేర్చుకోవటంతో పాటు.. తాను చెప్పినట్లు ఆర్టీసీ కార్మికులు మాట వినాలనుకోవటమే కారణంగా చెప్పక తప్పదు. దరిద్రపుగొట్టు ఇగోను కేసీఆర్ పక్కన పెట్టి.. తనలోని ఉద్యమనేతను బయటకు తీస్తే.. ఇష్యూ నిమిషాల్లో సెటిల్ కావటం ఖాయం. అందుకు భిన్నంగా సీఎం కేసీఆర్ హోదాలో.. తాను అనుకున్నది అనుకున్నట్లు జరగాలన్న పట్టుదలతో ఎన్ని సమీక్షలు జరిపినా.. అందుకోసం ఎన్ని గంటలు వెచ్చించినా సానుకూల ఫలితం చేకూరదన్నది మర్చిపోకూడదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: