అయోధ్య తీర్పు కోసం చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూశారు. అయితే తీర్పు  హిందువులకు అనుకూలంగా వచ్చింది. దీనితో సహజంగానే ముస్లింలు తమ అసంతృప్తిని తెలియజేస్తున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం తన తుది తీర్పును వెల్లడించింది. అయోధ్య వివాదాస్పద స్థలం రామజన్మభూమి న్యాస్ కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ముస్లీంలకు మసీదు నిర్మాణం కోసం అయోధ్యలో ప్రత్యామ్నాయంగా ఐదు ఎకరాలు స్థలాన్ని కేటాయించింది. హిందూ- ముస్లిం సంస్థల మధ్య వివాదానికి కారణమైన 2.77 ఎకరాల స్థలాన్ని అయోధ్య చట్టప్రకారం ఏర్పాటు చేసి  ఆలయ ట్రస్ట్ కు అప్పగించాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారం మొత్తం మూడు నెలల్లో పూర్తి చేయాలని ధర్మాసనం నిర్దేశించింది.


అయితే సుప్రీం కోర్ట్ తీర్పు పట్ల సున్నీ వక్ఫ్ బోర్డు లాయర్ తన అసంతృప్తిని తెలియజేశారు. కానీ అత్యున్నత న్యాయస్థానం తీర్పును గౌరవిస్తున్నామన్నారు.  సుప్రీం ఇచ్చిన ఐదు ఎకరాల భూమి మాకు అత్యంత ముఖ్యమైనది కాదన్నారు. తీర్పులో అనేక అంశాలు ఉన్నాయన్నారు. శాంతి నెలకొనాలని అంతా కోరుకుంటున్నామన్నారు. తీర్పులో ప్రతీ అంశాన్ని వ్యతిరేకించడం లేదు కానీ.. కొన్ని అంశాలపై మాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. కోర్టు తీర్పుపై రివ్యూకు వెళ్లే అంశాన్ని  అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టరాదని విజ్ఞప్తి చేశారు.


అయితే అయోధ్య తీర్పు నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ స్పందించారు. ఎవరు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పూనుకోవద్దని చెప్పారు. అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరు పక్షాలూ సుప్రీం కోర్టు కు తెలియ జేసిన మీదటే ఈ విషయం లో భారత దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది అని తెలిపారు. అలాగే ఇటువంటి పరిస్థితు ల్లో మత సామరస్యానికి భంగం కలిగించేలా రెచ్చ గొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలందరు సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తి చేస్తున్నాను అని సీఎం  జగన్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: