చంద్రబాబునాయుడు పిచ్చి పీక్స్ కు చేరుకుంటున్నట్లే ఉంది.  అబ్దుల్ కలాం విషయంలో చంద్రబాబు తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే  వైసిపి ఎంఎల్ఏ  రోజా చేసిన కామెంట్ నిజమే అనిపిస్తోంది. మూడు రోజులు జిల్లాలోని నేతలతో సమీక్ష జరిపిన తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ అబ్దుల్ కలాం కూడా తన విజన్ నే వాడుకున్నట్లు చెప్పారు.

 

మొదటిసారి సిఎం అయినపుడు చంద్రబాబు  విజన్ 2020 అనే పిచ్చిలో ఉండేవారు.  విజన్ 2020 అనే కాన్సెప్టును అమల్లోకి తెచ్చిన బ్రెజిల్, చిలీ లాంటి కొన్ని దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అటువంటి విజన్నే చంద్రబాబు ఏపిలో కూడా అమలు చేశాడు. అయితే చివరకు దారుణంగా ఓడిపోయాడు. అలాంటి చంద్రబాబు విజన్ గురించి అబ్దుల్ కలాం తెలుసుకున్నారట.

 

విజన్ 2020కి సంబంధించి కీలకమైన సమాచారం చంద్రబాబు దగ్గర ఉందని తెలుసుకున్న కలాం వెంటనే  తన దగ్గరకు వచ్చి కొన్ని పత్రాలను తీసుకెళ్ళాడట. తర్వాత దేశ ఆర్ధిక విజన్ పై అబ్దుల్ కలాం ప్రచురించిన ఓ పుస్తకంలో తన విజన్ నే వాడుకున్నారని చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది.

 

తన విజన్ నే అబ్దుల్ కలాం కాపీ కొట్టాడనో లేకపోతే వాడుకున్నాడనో చంద్రబాబు చెబితే కాదనేందుకు అవతల ఎవరూ లేరు. ఎందుకంటే కలాం ఎప్పుడో కాలం చేశారు. కాబట్టి చంద్రబాబు ఏమి చెప్పినా తప్పు పట్టేవారు  లేరు. కలాం గురించి చంద్రబాబు గురించి తెలిసిన వారు ఎవరు కూడా ఈ మాజీ సిఎం చెప్పే మాటలను విని నవ్వుకుంటారు తప్ప సీరియస్ గా తీసుకోరు.

 

అబ్దుల్ కలాం అంటేనే అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్న మిస్సైల్ శాస్త్రవేత్త అని అందరికీ తెలిసిందే. మిస్సైల్ పరిజ్ఞానంలో  ప్రపంచంలోని అతికొద్దిమంది సాధికారికత కలిగిన వారిలో కలాం పేరు ముందుంటుంది. అవటానికి మిస్సైల్ శాస్త్రవేత్తే అయినా ఇతర అంశాల్లో కూడా విశేషమైన జ్ఞానం ఉన్న వ్యక్తి కలాం. అలాంటిది ఫెయిల్యూర్ కాన్సెప్టయిన విజన్ 2020ని తన దగ్గర నుండే కలాం తీసుకున్నాడని చెప్పటమే విచిత్రంగా ఉంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: