వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ట్విట్ స్టార్ విజయసాయి రెడ్డి ట్విట్టర్ లో ట్విట్ చేస్తూ నారా లోకేష్ వ్యంగ్యాస్థ్రాలు కురిపించాడు. ప్రతి రోజు ఏదొక విషయంపై స్పందించే విజయసాయి రెడ్డి, ఈరోజు చంద్రబాబు సుపుత్రుడు నారా లోకేష్ పై సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా నారా లోకేష్ పై విరుచుకుపడ్డాడు. బడుగు బలహీన వర్గాల వారు ఇంగ్లీష్ చదువుతే నీ భాధ ఏంటి లోకేష్ అని ప్రశ్నిస్తున్నారు. 


విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ట్విట్ చేస్తూ.. ''సచివాలయం, మంగళగిరి, గుంటూరు అనే పేర్లు సరిగా పలకడమే రాని మాలోకం తెలుగు ఉద్యమకారుడిలా మాట్లాడుతున్నాడు. మా పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదువుతారు. బడుగు బలహీన వర్గాల వారికి ఆ చదువులెందుకు అంటున్నాడు. వాళ్లు గ్రామాలు దాటి బయటకు రావద్దన్నది టిడిపి దుర్మార్గ కోరిక. 


పేద పిల్లలు ఇంగ్లిష్ మీడియంలో చదివితే ఇక తెలుగు పేపర్లు ఎవరు కొని చదువుతారు అన్నది పచ్చ మీడియా ఆందోళన కాబోలు. బాబు అవినీతిని కప్పిపుచ్చి పాఠకుల మెదళ్లలోకి స్లో పాయిజన్ ఎక్కించే అవకాశం ఉండదని  ఏడుపు. వీళ్ల కుటుంబాల్లోని పిల్లలు తెలుగు మాట్లాడటానికే ఇష్టపడరు.'' అంటూ నారా లోకేష్, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండి పడ్డారు విజయసాయి రెడ్డి. 


కాగా ఈ ట్విట్లు చుసిన నెటిజన్లు.. ''లోకేష్ బాబు బాధంతా వాళ్ళ బాబు డొనేషన్ కట్టి హర్వర్డ్ లో చదివించాడు కానీ అదే తెలుగు మీడియంలో చదివించక పోవడంతో ఈరోజు తన నాయకత్వానికి శూన్యత వచ్చింది. తెలుగులో మాట్లాడలేక చస్తున్నాడు అంటూ ఘాటుగా ట్విట్ చేశారు. దీంతో ప్రస్తుతం విజయసాయి రెడ్డి ట్విట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: