లోకంలో మనుషులు బాధ్యతలనూ, బంధాలనూ మరచి  కపట నాటకాలు వేస్తూ, తనను తాను మోసం చేసుకుంటూ జీవిస్తున్నారు. నిజంగా మన దురవస్థల్లో ఒకటి ఏమిటంటే, మనలో చాలామంది జీవితంలో ఏది బాధ్యతగా భావించకపోవడం. ఈ బాధ్యతరాహిత్యం వల్ల మానవ సంబంధాల విలువలు కూడ రోజు రోజుకు దిగజారిపోతున్నాయి. ఇకపోతే పుట్టింటి గడప దాటి మెట్టినింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల ఆ యింటికి కోడలే కాదు కూతురు కూడా కాని నేడు సమాజంలో కొందరు దరిద్రులు కూతురిలా భావించ వలసిన కోడలుతో తమ శారీరక వాంఛలు తీర్చుకుంటున్నారు.


అంతే కాకుండా తమకు లొంగని వారి ప్రాణాలను నిర్ధాక్షణ్యంగా తీస్తున్నారు. మనిషిలో మానవతా విలువలు మచ్చుకైన కనబడకుండా మాయం అవుతున్నాయనడానికి ఇలాంటి ఘటనలే ఉదాహరణ. ఇకపోతే భార్యచనిపోయిన ఓవ్యక్తి తన శరీర వాంఛ తీర్చలేదని స్వంత కొడుకు భార్యనే హత్యచేయడానికి ప్రయత్నించాడు. వివరాలు తెలుసుకుంటే రాగిముద్దనహళ్లి గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు అనిల్‌కు, హాసన్‌ జిల్లాకు చెందిన వీణ (26)అనే అమ్మాయితో ఆరేళ్ల క్రితం వివాహమైంది.


కాగా రెండేళ్ల క్రితం నాగరాజు భార్య సావిత్రమ్మ మరణించడంతో అప్పటినుంచి నాగరాజు కళ్లు కోడలు మీద పడ్డాయి. ఈ క్రమంలో ప్రతిరోజూ కోడలు వీణను లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. అతని వేధింపులు రోజురోజుకు తీవ్రతరం కావడంతో విషయాన్ని భర్త అనిల్‌ దృష్టికి తీసుకెళ్లడంతో అనిల్‌ సైతం తండ్రి నాగరాజును పలుమార్లు హెచ్చరించాడు. అయినా గాని తన బుద్ది మార్చుకోని నాగరాజు వీణను లైంగికంగా వేధించసాగాడు.


అతని బాధ భరించలేక అనిల్‌ భార్య, పిల్లలతో కలసి ఆ గ్రామంలోనే వేరుగా ఉండసాగాడు. అయినా గాని వీణను మాటలతో చేష్టలతో వేధించసాగాడు ఆ కీచకుడు. ఓపిక నశించిన అనిల్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జైలుకెళ్లిన నాగరాజు జామీనుపై విడుదలై కోడలి మీద కక్షతో అతని తమ్ముడితో కలిసి కత్తితో విచక్షణ రహితంగా దాడి చేయగా, ఆ సమయంలో వీణ వేసిన కేకలకు  అనిల్, అతని చుట్టు పక్కల వారు బయటకు వచ్చేలోపలే వీణ రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతోంది.


నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నించగా నాగరాజు, అతని తమ్మునితో కలిసి బైకుపై తప్పించుకున్నారు. తీవ్రంగా గాయపడిన వీణను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందింది... నిజంగా ఈ సంఘటన ఇప్పుడున్న సమాజంలోని మనషుల మనస్తత్వాలకు అద్దం పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: