ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్‌బ్రాండ్ ఆర్కే రోజా విశాఖపట్నం భీమిలీ బీచ్ లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరై సంద‌డి చేశారు. ఈ సందర్భంగా పలువుర్ని ఘనంగా సన్మానించారు. రోజా తన ప్రసంగంతో అందర్ని ఆకట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే రోజా తన ప్రేమకథను మరోసారి గుర్తు చేసుకున్నారు. భీమిలీ బీచ్ లలోనే సెల్వమణితో తన ప్రేమ కథ మొదలైందన్నారు. ఆపై పుష్కరకాలం పాటు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని చెప్పారు. 


చామంతి మూవీ... ఇదే భీమిలీ బీచ్ లో సంవత్సరం పాటు షూటింగ్ చేశాము. ఇక్కడే భానుమతిగారు, సెల్వమణిగారు, ప్రశాంత్, నేను... సాంగ్స్... ఆల్ మోస్ట్ వన్ ఇయర్ ఇదే బీచ్ లో మేమున్నాము. అలాగే త‌న‌ను త‌మిళ చిత్రసీమ‌కు ప‌రిచయం చేసింది కూడా ద‌ర్మ‌కుడు ఆర్‌.కె. సెళ్వ‌మ‌ణియే అని అన్నారు. నా సినిమా కెరీర్ కి ఇక్కడే నాంది పలకడం గమనించాల్సి విషయం. 


అలాగే, నా భర్త సెల్వమణితో ప్రేమ పుట్టిన ప్లేస్ కూడా భీమిలీనే. ఆయన ఇక్కడే ఐ లవ్యూ చెప్పడం, ఆ తరువాత పన్నెండు సంవత్సరాలు ప్రేమించుకుని, పెళ్లి చేసుకుని, ఇప్పుడు ఇద్దరు పిల్లలతో గృహిణిగా కూడా సక్సెస్ ఫుల్ గా ఉన్నానంటే, భీమిలీతో ఉన్న నా అనుబంధాన్ని మీరు ఊహించుకోవచ్చు అని ఆమె అన్నారు.


కాగా, గతంలో తెలుగు దేశం పార్టీలో మహిళా అధ్యక్షురాలుగా ప‌ని చేశారు.  2009 అసెంబ్లీ ఎన్నికలలో చంద్రగిరి నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ త‌ర్వాత 2014 నవంబరులో నగరి నియోజకవర్గం వైయస్సార్ పార్టీ తరపు నుండి పోటి చేసి ఎమ్మెల్యే గా గెలుపొందారు. అలాగే 2019 మే నెలలో రెండవ సారి నగరి నుండి ఎమ్మెల్యే గా గెలిచారు.


మరింత సమాచారం తెలుసుకోండి: