ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌలు రైతులకు మంచి శుభవార్త చెప్పింది. వైఎస్సార్‌ రైతు భరోసాకు సంబంధించిన విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు. అధికారులు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం, డిప్యూటీ సీఎం బోస్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కౌలురైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా దరఖాస్తులు స్వీకరించేందుకు డిసెంబర్ 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు మంత్రి తెలిపారు.


ఇకపోతే ఈ గడువు తేది కేవలం  కౌలు రైతులకు మాత్రమే వర్తిస్తుందని, మిగిలిన రైతులకు మాత్రం ఈనెల 15 వరకే అవకాశం ఉందన్నారు మంత్రి. ఇక  ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు ఈ పథకాన్ని వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటుందని, అంతే కాదు మూడు రోజుల పాటూ రైతు భరోసాకు సంబంధించిన  ప్రత్యేకంగా స్పందన కార్యక్రమాన్ని కూడా తహసీల్దారు కార్యాలయాల్లో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కేవలం రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మాత్రమే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


అదీ కాకుండా గతవారం నిర్వహించిన ప్రత్యేక స్పందనలో 2.89 లక్షల అర్జీలు వచ్చాయని.. ఇప్పుడు వీటిని పరిష్కరించే పనిలో ఉన్నామన్నారు. ఇకపోతే ముఖ్యమంత్రి జగన్ కొద్దిరోజుల క్రితం రైతు భరోసాపై సమీక్ష నిర్వహించి, అర్హులైన ఏ ఒక్క రైతుకు గాని, కౌలు రైతుకు గాని రైతు భరోసా పథకం అందలేదన్న  విమర్శలు రాకుండా చూడాలని సీఎం భావిస్తున్నారు. అందుకు గాను రైతులు, కౌలు రైతుల సమస్యలను వెంట వెంటనే తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశాలు జారి చేశారు..


ఇలాంటి సమస్యలు త్వరగా పరిష్కరిస్తే మరో 5 లక్షల మంది భూ యజమానులైన రైతులకు రైతు భరోసా పథకం వర్తిస్తుందని అంచనా వేస్తున్నారట అధికారులు. ఇకపోతే జగాన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన ఒక్కో హమినీ క్రమక్రమంగా నెరవేర్చుకుంటు వస్తున్నాడు. ఈ పధకాలు ఇలాగే విజయవంతంగా కొనసాగుతు పేదప్రజలందరికి కూడా లబ్ధి చేకూరుతే జగన్ లాంటి నాయకుడు మరొకరు లేరంటూ చరిత్రలో గుర్తుండి పోయేలా నిలిచిపోతారంటున్నారు ఏపీ ప్రజలు.



మరింత సమాచారం తెలుసుకోండి: