సమాజంలో రోజు రోజుకు మానవ సంబంధాలు ఎలా మంట కలుస్తున్నాయో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా వివాహేతర సంబంధాల వల్ల చాలా మంది జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కొందరు భర్తలు భార్యలను చంపేస్తుంటే... ఇటీవల అందుకు రివర్స్లో ప్రియుళ్ల మోజులో పడిన భార్యలు భర్తలను కూడా చంపేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంతంగా ఉన్న ఓ దంపతుల జీవితంలో వివాహేతర సంబంధం చిచ్చు చివరకు ఆ భర్తనే
భార్య చంపేసే వరకు తీసుకు వెళ్లింది.
కేరళలో
నూనె వ్యాపారం చేసేవాడు శ్యామ్. అతడికి సోఫియా అనే యువతిని ఇచ్చి ఆరేళ్ళ క్రితం వివాహం చేశారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. ప్రశాంతంగా సాగిపోతున్న వీరి జీవితంలో వివాహేతర సంబంధం చిచ్చు రేపింది. పెళ్ళి కాకముందు నుంచి ఉన్న ప్రియుడిని వదులుకోలేక భర్తను అతి దారుణంగా చంపేసింది
భార్య సోఫియా.
కేరళలో
నూనె వ్యాపారంలో లాభాలు సాధించిన
శ్యామ్ - సోఫియా దంపతులు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. సోఫియా ప్రియుడు అరుణ్ కూడా అక్కడే ఉండేవాడు. సోఫియాకు కొడుకు పుట్టిన తరువాత అరుణ్ - సోఫియా మధ్య వివాహేతర సంబంధం కంటిన్యూగా కొనసాగింది. ఈ క్రమంలోనే వీరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేని పరిస్థితి వచ్చేసింది.
శ్యామ్ ఆస్ట్రేలియాలో కోట్లాది రూపాయల ఆస్తులు కూడబెట్టాడు.
భర్తతో సంసారం చేసేందుకు ఎంత మాత్రం ఇష్టం లేని సోఫియా చివరకు ప్రియుడి ఉచ్చులో పూర్తిగా పడిపోయింది. ఈ క్రమంలోనే ప్రియుడు అరుణ్తో కలిసి భర్తను చంపేం దుకు ప్లాన్ వేసింది. భర్తకు సైనైడ్ కలిపిన ఆరెంజ్ జ్యూస్ తాగించింది. దీంతో
శ్యామ్ అక్కడికక్కడే చనిపోయాడు. దీనితో తన
భర్త గుండెపోటుతో చనిపోయాడని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది.
పోలీసులు అనుమానంతో పోస్టు మార్టం చేయగా అసలు విషయం బయటపడింది. సెనైడ్ కలిపిన జ్యూస్ తాగడం వల్లే అతడు చనిపోయాడని తేలింది. చివరకు
ఆస్ట్రేలియా కోర్టు ప్రియుడు అరుణ్కు 25 యేళ్ళ జైలు, సోఫియాకు 22 యేళ్ళ జైలు శిక్ష విధించింది.