ఈమధ్య హత్యలు చేయడం కామన్ గా మారిపోయింది. మానవత్వం మరిచి కసాయిలు మారుతున్న జనాలు  కొంచెం కూడా కనికరం లేకుండా సాటి మనిషి ప్రాణాలను గాల్లో కల్పిస్తున్నారు. చిన్నచిన్న గొడవలకు ప్రాణాలు తీస్తున్నారు మనుషులు. సమాజంలో రోజురోజుకి మానవత్వం మంటగలిసి పోతుంది. సాటి మనుషుల మీద కనీస మానవత్వం మరిచిన మనుషులు  రాక్షసుల్లా  మారి అతిదారుణంగా హత్యలు చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే అతికిరాతకంగా చంపేసి దర్జాగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే ఇలాంటి హత్యలు ఎన్నో తెరమీదకు వచ్చాయి. 



 ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనే మరోటి జరిగింది. హాయిగా రోడ్డు మీద ద్విచక్ర వాహనం పై  వెళ్తున్న ఓ యువకుడిని ఓ వ్యక్తి హఠాత్తుగా తుపాకీతో కాల్చేసాడు. దీంతో ఆ యువకుడు  అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.  తుపాకీతో కాల్చిన వ్యక్తి మాత్రం దర్జాగా రోడ్డుపైనే నడుచుకుంటూ వెళ్ళాడు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నిన్న సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఓ దుండగుడు తుపాకీతో పట్టుకుని అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఇంతలో అటువైపుగా ద్విచక్రవాహనంపై వస్తున్న యువకునికి తుపాకి ఎక్కుపెట్టి యువకుడు చూసేలోపే తుపాకీ గుండు యువకుడు గుండెల్లో దింపేసాడు ఆ వ్యక్తి . దీంతో ఆ యువకుడు  పక్కనే ఉన్న కారును ఢీ కొట్టి కుప్పకూలిపోయాడు యువకుడు. 



 ఇక ఆ తర్వాత తుపాకీతో కాల్చిన  ఆ వ్యక్తి మాత్రం దర్జాగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అయితే గాయపడిన ఆ యువకుడిని ఎవరు చూడకపోవడంతో ఆ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ యువకుని కాపాడేందుకు స్థానికులు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో అక్కడి కుప్పకూలిపోయిన ఆ యువకుడు విలవిలలాడుతూ ప్రాణాలు వదిలాడు. అయితే చనిపోయిన యువకుడి పేరు కబీర్ తోమర్  అని  సమాచారం. అయితే ఆ యువకున్ని సదరు  వ్యక్తి తుపాకీతో ఎందుకు తుపాకీతో కాల్చాడు  అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: