మీకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో అకౌంట్ ఉందా? అయితే స్టేట్ బ్యాంక్ కస్టమర్లను హెచ్చరిస్తుంది.. ఇకనుండి మీరు అలర్ట్ గా ఉండవలసిన అవసరం ఉంది.. అదేమంటే అకౌంట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఇతర వ్యక్తిగత సమాచారం, ఖాతా వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయవద్దు. మా హెచ్చరికను కాదని మీరు ఇలాంటి పనులు చేస్తే దీనివల్ల ఒకవేళ ఖాతాదారులకు నష్టం కలిగితే తాము దానికి బాధ్యులం కాదని బ్యాంక్ స్పష్టం చేసింది.
ఇలాంటి పనులు చేయడం వల్ల సెక్యూరిటీ సమస్యలు రావొచ్చు. వివరాలను షేర్ చేయడం వల్ల ఖాతాదారులకు ఏమైనా నష్టం వాటిల్లితే దానికి మేం బాధ్యత తీసుకోం. కాబట్టి ఇలాంటివి ఏమైనా చేసి ఉంటే వెంటనే అలాంటి పోస్ట్ను తొలగించండి’ అని ఎస్బీఐ ట్వీట్ చేసింది.. ఈ ట్వీట్కు రిప్లేగా ఒక బ్యాంక్ కస్టమర్.. తన సేవింగ్స్ అకౌంట్ నెంబర్, ఇతర డాక్యుమెంట్లను పోస్ట్ చేశారు. దీంతో బ్యాంక్ స్పందించింది. వెంటనే ఆ పోస్ట్ను డిలేట్ చేయాలని సదురు కస్టమర్ను కోరింది.
అతనికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అతని చేత ఆ డిటైల్స్ తొలగించింది. ఇదేకాకుండా ఏ బ్యాంక్కు చెందిన ఉద్యోగులు ఎవరు కూడా కస్టమర్లను ఎప్పటికీ పేమెంట్ లింక్ లేదా ఇతర ట్రాన్సాక్షన్ లేదా వీపీఏ యూపీఐ సంబంధిత వివరాలు కావాలని కోరరని, యూజర్ ఐడీ, పిన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, సీవీవీ నెంబర్, ఓటీపీ వంటి వివరాలను కూడా తెలియజేయమని అడగరని అలా ఎవరైనా అడిగితే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
ఇకపోతే ఈ మధ్యకాలంలో జరుగుతున్న మోసాలను దృష్టిలో పెట్టుకుని ఎస్బీఐ ఎప్పటికప్పుడు తన కస్టమర్లను హెచ్చరిస్తూ వస్తోంది. మోసగాళ్ల బారిన పడద్దని సూచిస్తోంది. ఎస్ఎంఎస్ రూపంలో వచ్చే లింక్పై క్లిక్ చేయవద్దని తెలియజేసింది. మీ అకౌంట్ స్టేటస్ తెలుసుకోవాలనిపిస్తే బ్యాంక్ బ్రాంచ్కు వెళ్లాలని కోరింది. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మీ అకౌంట్లో డబ్బులు జాగ్రత్తగా ఉంటాయి. లేదంటే ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది.