ఓ ప్రముఖ లైవ్ ఛానల్ షో లో పాల్గొన్న టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్... వైసీపీలో చేరేందుకు సిద్దమైన వల్లభ నేని వంశి గురించి మాట్లాడుతూ, "ఒకటి వంశీ కి పార్టీ మారడం ఇష్టం ఉండి...లేకపోతే ఈ పార్టీలో ఇబ్బందులు ఉండి వెళ్తే మంచిదే కానీ వెళ్తూ వెళ్తూ టీడీపీ ని నిందించడం బాలేదు. ఆయనకి ఆయన తండ్రి జన్మనిస్తే చంద్రబాబు రాజకీయ జన్మనిచ్చారు.


అనడంతో  ఆ ఛానల్ ఇంటర్వ్యూయర్ 'అస్సలు టీడీపీకి ఆయనికి ఎటువంటి కనెక్షన్ లేదంటున్నారు.. వల్లభనేని వంశీ గారు.. దీనికి మీ సమాధానం ఏంటి?' అని ప్రశ్నించగా... బాబూ రాజేంద్రప్రసాద్ స్పందిస్తూ.. "ఎన్టీఆర్ కుటుంబానికి సన్నిహితమైన దాసరి కుటుంబాన్ని కాదని, దాసరి రమేష్ గారిని, దాసరి బాలవర్ధనరావు గారిని పక్కన పెట్టి ఇదే చంద్రబాబునాయుడు గారు ఏ కనెక్షన్ లేకుండా ఏ ఎమోషన్ లేకుండా... అతనికి సీటు ఇచ్చారా? డెల్టాకు రావాల్సిన పోలవరం కుడి కాల్వ నీటిని మోటార్ల ద్వారా తరలించడానికి వంశీ ప్రయత్నిస్తే.. దేవినేని ఉమా అప్పుడే మోటార్లు పెట్టొద్దన్నారు. కానీ చంద్రబాబు నాయుడు అంగీకరించారు’ అని తెలిపారు.


ఇంకా మాట్లాడుతూ.. "గన్నవరం విమానాశ్రయాన నిర్మాణం కోసం పొలాలు తీసుకుంటుంటే ఆ రైతులకు అమరావతిలో స్థలాలు కావాలన్నాడు. దీనికి కూడా చంద్రబాబు అంగీకరించి ఇస్తానన్నారు. అంటే చంద్రబాబు నాయుడు వంశీ ని ఎంత ప్రత్యేకంగా ట్రీట్ చేసారో ఎంత మంచిగా చూసుకున్నారో....అటువంటి చంద్రబాబు నాయుడిని గాని, లొకేషన్ గాని, కన్నతల్లి టిడిపిని కాదని... ఇన్ని నిందలు వేయడం, మాటలు అనడం బాధాకరం." అన్నారు. 


అప్పుడే లైవ్లోకి వచ్చిన వల్లభనేని వంశీ.. రాజేందర్ అన్న.. అరే ముందు ఒక నిమిషం ఉండు... అంటూ ప్రారంభించి... " నాకు ఒక్క పొలం కూడా లేదు. నా పొలానికి నీళ్లిచ్చావా నువ్వు? భూసేకరణలో వాళ్ళ పొలలు ఇస్తే కాలువ తవ్వారు... మీ అయ్య జాగీరా వాళ్ళకి నీళ్లివ్వననడానికి.. ఎవరి పొలం ఇచ్చారో వాళ్లకు నీళ్లు ఇవ్వను అనడానికి నువ్వెవరివయ్యా? అని అనడంతో.. "అక్కడకి రావాల్సిన నీటికి నువెవరివయ్యా పైపులు వెయ్యడానికి..దానికి ఒక పద్ధతి సిస్టం ఉంటుంది", అని రాజేంద్రప్రసాద్ అన్నారు. 


దీంతో వంశీ కోపం తో ఊగిపోతూ...." నోరుమూయి.. పొలం ఎవరిచ్చారో వాళ్లకి నీళ్లు ఇవ్వకుండా.. ఎవరి పొలానికి నీళ్లు ఇచ్చార్రా.... చెత్త నా కొ*కా. నోరు మూయరా.. ఒంటి కన్నుగా.. చెత్త వెధవ.. డొక్క పగిలిద్దిరా రాజేంద్ర.. చెప్పు తెగుతుంది రాజేంద్రా..ఒక్కసారైనా గెలిచావ్ రా వెధవ.. బోడే ప్రసాద్ దగ్గర ఎంత డబ్బు తీసుకున్నావ్ రా.." అనడంతో లైవ్ కట్ చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: