మొన్ననే విజయవాడలోని కమిషనర్ ఆఫీస్ లో తెలుగుదేశం పార్టీ యొక్క సామాజిక మాధ్యమాల పైన తన ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు నష్టం కలిగిస్తున్నారని కేసు పెట్టిన వల్లభనేని వంశీ అడుగులు ఇప్పుడు క్రమంగా ఎటు వైపు గా మారుతున్నాయో మెల్లిమెల్లిగా అందరికీ అర్థమవుతుంది. ఈ మధ్యనే జగన్ ను కలిసిన వంశీ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ఆయనకు సహాయం చేయాలని కోరగా జగన్ కూడా సానుకూలంగా స్పందించిన తీరు మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు అదే విషయాన్ని అడ్డుపెట్టుకొని వంశీ మాట్లాడుతున్న మాటలు మాత్రం కొందరికే హాస్యాస్పదంగా మరికొందరికి అనాలోచితంగా ఇంకొందరికి వెర్రితనం గా అనిపిస్తున్నాయి.

విషయం ఏమిటంటే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డితో తనకు పరిచయం ఉందని చెప్పుకోవడానికి వంశీ మోహన్ చెప్పిన కబుర్లు చాలా విడ్డూరంగా ఉన్నాయి. ముఖ్యంగా జగన్ తో తనకు పాతికేళ్లుగా పరిచయం ఉందని వంశీ చెప్పుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జగన్ కు ఇప్పుడు ఒక 46 ఏళ్లు ఉంటాయి పాతికేళ్ల నుంచి ఆయనకు వంశీ తో పరిచయం అంటే జగన్ కు ఇరవై రెండేళ్ల నుంచి వంశీమోహన్ తెలిసి ఉండాలి.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అప్పటికే వైఎస్ తనయుడిగా గుర్తింపును పొంది ఉండవచ్చు. వైఎస్ కాంగ్రెస్ లో ఉన్నత పదవులు పొందిన నేత కావడంతో.. ఆయన తనయుడిగా అప్పటికి జగన్ కు గుర్తింపు ఉంది. అయితే అప్పటికి వంశీ మోహన్ ఎవరు? అంటే మాత్రం సమాధానం లేదు.పాతికేళ్ల కిందట వంశీ మోహన్ రేంజ్ ఏంటి? అప్పటికి అతడి స్థాయి ఎంత? ఇక వంశీ మోహన్ ఏమీ రాయలసీమ ప్రాంతానికో హైదరాబాద్ లో చదువుకున్న వ్యక్తో కాదు కూడా.

ఇవేమీ ఆలోచించకుండా నాకు వైయస్ జగన్ తో పాతికేళ్ల పరిచయం ఉందంటూ ఒక కోత కోశాడు వంశీ. అతను మాట్లాడే మాటలు లాజికల్ గా లేకపోవడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో అతనిపై తీవ్రమైన సెటైర్లు వస్తున్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకి చేరే ప్రయత్నం లోనే వంశీ ఇలా మాట్లాడుతున్నారని కొంతమంది కొలిక్కి వచ్చేసారు కూడా.


మరింత సమాచారం తెలుసుకోండి: