వైసీపీ మంత్రి కొడాలి నాని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, మాజీ మంత్రి ఉమామహేశ్వరరావులపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. లుచ్చా, సన్నాసీ, వెధవ అంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. వైసీపీ పాలనపై టీడీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని వివరిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.


చంద్రబాబు పాత చరిత్రను తవ్విపోస్తూ మంత్రి నాని విమర్శలు గుప్పించారు.. అమ్మ ఇందిరమ్మ ఆదేశిస్తే ఎన్టీ రామారావుపై పోటీ చేస్తానని చంద్రబాబు ప్రగల్భాలు పలికారన్నారు కొడాలి నాని. కాంగ్రెస్‌ పార్టీలో ఓడిపోయిన చంద్రబాబు మూడు రోజులకే ఎన్టీ రామారావు పార్టీలో చేరారని కొడాలి నాని గుర్తు చేశారు. రెండుసార్లు కాంగ్రెస్‌ పార్టీలో సీటు ఇచ్చి, మంత్రి పదవి ఇస్తే ఆ పార్టీని ఎందుకు వీడావని ప్రశ్నించారు. ఎన్టీ రామారావు బిడ్డనిచ్చి, మంత్రి పదవి ఇస్తే..ఆయనకే వెన్నుపొటు పొడిచి సీఎం పీఠాన్ని లాక్కున్న లుచ్చా, సన్యాసి, వెధవ చంద్రబాబు అని కొడాలి నాని ఫైర్‌ అయ్యారు.


మీ ఇద్దరు లుచ్చాలు కలిసి నన్ను అడుగుతారా? మీ అమ్మ మొగుడికి చెప్పానా సన్నబియ్యం ఇస్తానని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది చంద్రబాబే అని కొడాలి నాని పేర్కొన్నారు. 2014 ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలోకి తీసుకెళ్లి..వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చింది వాస్తవం కాదా అన్నారు.


ఆదినారాయణరెడ్డి సభలో అసభ్యంగా మాట్లాడితే చంద్రబాబు వెకిలినవ్వులు నవ్వింది నిజం కాదా అన్నారు. వైయస్‌ జగన్‌ ఎవరికి పార్టీ కండువా కప్పలేదన్నారు. చంద్రబాబు విధానాలను విభేదించిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ..తాను వైయస్‌ జగన్‌కు మద్దతు తెలుపుతున్నానని ప్రకటించారన్నారు. వైయస్‌ఆర్‌సీపీలో చేరతానని వంశీ ప్రకటించారన్నారు. చంద్రబాబు పెద్ద లుచ్చా ..తండ్రి లేని నిన్ను మోసం చేశాడని దేవినేని అవినాష్ కు అప్పుడే చెప్పానని కొడాలి నాని తెలిపారు. ఈ రోజు అతను వచ్చి మా పార్టీలో చేరారన్నారు కొడాలి నాని .


మరింత సమాచారం తెలుసుకోండి: