ప్రేమ గుడ్డిది అంటారు పెద్దలు. కొన్ని ఘటనలు చూస్తే అది నిజమేమో అనిపిస్తుంటుంది. ఇది చాలా సార్లు ఫ్రూవ్ అయ్యింది కూడా. ఇక ఇటీవల అక్రమ సంబంధాలు దారుణంగా పెరిగిపోతున్నాయి. పరాయి భర్తలు, పరాయి భార్యల మోజులో పడి ఎంతో మంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కర్నాకటలో ఓ దారుణం జరిగింది. ముగ్గురు పిల్లల తల్లి అయిన
మహిళ, అవివాహితుడైన యువకుడు ప్రేమలో పడ్డారు. వీరి మధ్య కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కూడా నడుస్తోంది. చివరకు ఆ యువకుడికి
పెళ్లి కుదిరింది.
వీరిద్దరు విడిపోయి బతకలేమని నిర్ణయించుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కర్నాకటలోని గదగ
జిల్లా రోణ తాలూకా హీరేహాళ్ల గ్రామానికి చెందిన ఈరమ్మ అనే మహిళకు కొంతకాలం క్రితం వివాహమైంది. ఆమెకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే తాగుడుకు బానిస అయిన భర్త ప్రాణాలు కోల్పోవడంతో ఈరమ్మ కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది.
ఈ క్రమంలోనే ఆమెపై కన్నేసిన
ఆర్టీసీ డ్రైవర్ శంకరగౌడ అనే యువకుడు ఆమెకు దగ్గరయ్యాడు. చివరకు వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈరమ్మ కూడా భర్త లేకపోవడంతో శంకరగౌడతో తన కోరికలు తీర్చుకుంటోంది. ఇటీవల శంకరగౌడకు తల్లిదండ్రులు ఓ యువతితో వివాహం నిశ్చయించారు. మరో రెండు వారాల్లో శంకరగౌడ
పెళ్లి జరగాల్సి ఉంది. ఇందుకు శంకర్ తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసి
పెళ్లి పనుల్లో బిజీ అయ్యారు.
పెళ్లి అయితే ఈరమ్మకు తాను దూరమవుతానని శంకర్ తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. చివరకు వారిద్దరు ఒకరిని విడిచి మరొకరు ఉండలేమన్న నిర్ణయానికి వచ్చేశారు. దీంతో ఈరమ్మ, శంకరగౌడ శుక్రవారం గ్రామ శివారులో ఒకే చెట్టుకు ఉరేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో 15రోజుల్లో పెళ్లిపీటలెక్కాల్సిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో శంకరగౌడ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.