పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ప్లాస్టిక్‌ను పారద్రోలేందుకు నో ప్లాస్టిక్ - న్యూ నగరి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏపీఐఐసీ చైర్ పర్సన్, వైఎస్పార్సీపీ ఎమ్మెల్యే రోజా బర్త్ డే సందర్భంగా ఆమె సరికొత్త ఆఫర్ ప్రకటించారు. అదీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి ప్రజలకు మాత్రమే. తన వంతు సామాజిక బాధ్యతగా పర్యావరణ హితానికి కృషి చేస్తున్నారు. ఆ దిశగా తన నియోజకవర్గ ప్రజలను ప్రోత్సహించేందుకు ఆమె వినూత్న కార్యక్రమం చేపట్టారు. 


ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించేందుకు ఎమ్మెల్యే రోజా ముందుకొచ్చారు. తన పుట్టినరోజు సందర్భంగా నో ప్లాస్టిక్ - న్యూ నగరి కార్యక్రమాన్ని ఆమె ఆదివారం ప్రారంభించారు. అందులో భాగంగా ప్లాస్టిక్ తెచ్చి ఇచ్చిన వారికి అదే మొత్తంలో బియ్యం పంపిణీ చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమం పలుచోట్ల ప్రారంభమైనప్పటికీ అంతంత మాత్రంగానే స్పందన వస్తోంది కానీ  ఇలాంటి మంచి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు సెలబ్రిటీలు.. బాధ్యత గల వ్యక్తులు ముందుకొస్తే ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని.. అందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రోజా చెప్పారు . 


ప్లాస్టిక్ వినియోగంపై సామాజిక చైతన్యం అవసరమని రోజా అభిప్రాయపడ్డారు. ఎక్కువ మందిని ఇందులో భాగస్వాములను చేసేందుకే బియ్యం పంపిణీని చేపట్టినట్లు చెప్పారు. పేదలకు ఉపయోగకరంగా ఉండాలనే ఉద్దేశంతోనే  ప్లాస్టిక్‌కి సమానంగా బియ్యం అందజేస్తున్నామన్నామని ,చాలా మంది ప్లాస్టిక్‌ను తీసుకొచ్చి బియ్యాన్ని తీసుకెళ్తున్నారని తెలిపారు . 


ప్లాస్టిక్ అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని రోజా అన్నారు. భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలని.. అందుకోసం ప్రజలను చైతన్య వంతులను చేయాలన్నారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై మీడియా, సోషల్ మీడియా.. అన్ని రకాలుగా విస్తృత ప్రచారం కల్పిస్తే దాని ద్వారా ఎక్కువ మంది స్ఫూర్తి పొందే అవకాశం ఉంటుందన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: