ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఎంత హాట్ హాట్ గా ఉన్నాయో అందరికి తెలిసిందే. ప్రతిపక్షా పార్టీలు కలిసి ఆ పార్టీలపై పడుతున్నాయి. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కూడా అవ్వకముందే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. తెలుగుదేశం పార్టీ చేసే దీక్షలు, పవన్ కళ్యాణ్ చేసే లాంగ్ మార్చులు చూడలేక.. 

                        

ఒకొక్కరు పార్టీ నుండి బయటకు వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి తెలుగుదేశం పార్టీ చేసే చిల్లర రాజకీయం నచ్చక పార్టీ మారుతున్న అని, చంద్రబాబు కొడుకు నారా లోకేష్ కోసం మంచి మంచి నాయకులను పక్కన పెడుతున్నాడు అని, అలానే ఎన్టీఆర్ కి కూడా రాజకీయ భవిష్యేత్తు లేకుండా చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

                    

దీంతో ఈ వ్యాఖ్యలపై స్పందించిన తెలుగు దేశం పార్టీ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. మా తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ కంటే స్ట్రాంగ్ మాకు ఎన్టీఆర్ అవసరం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. అంతే కాదు వల్లభనేని వంశీకి కూడా ప్రశ్నల వర్షం గుప్పించారు. 


మరో వైపు తెలుగు దేశం పార్టీ నాయకులూ అంత ఒకోకరు ఒకో పార్టీలోకి వెళ్లి చేరుతున్నారు. ఇప్పటికే యువ నాయకులూ అంత పార్టీలు మారారు. దీనికి కారణం లోకేష్ బాబు ఏ అని.. అతను ఒక పప్పు అని.. ఆ పప్పు మాటలు మేము వినాలా ? అంటూ పార్టీ నుండి బయటకు వచ్చిన నాయకులూ లోకేష్ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: