తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఉద్యమం చేసి
తెలంగాణ సంపాదించాడు . అయన ఒక ఉద్యమకారుడిగానే మనకు తెలుసు. కానీ ఇప్పుడు
తెలంగాణ లో అయన ర్టీసీ ఫై వ్యవహరిస్తున్న శైలి చుస్తే ఆయనలో ఓ నియంత కనిపిస్తున్నారన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలంటూ ఏళ్ల తరబడి ఉద్యమం సాగించిన కేసీఆర్... నాడు అధికారంలో ఉన్న ప్రభుత్వాల నియంతృత్వ ధోరణులను ఏ స్థాయిలో ఎండగట్టారో తెలిసిందే.
అయితే
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించడం ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన కేసీఆర్... ఇప్పుడు తన సెకండ్ టెర్మ్ పాలనలో తానెంత కఠినాత్ముడినన్న విషయాన్ని ఇట్టే బయటపెట్టేసుకున్నారని చెప్పక తప్పదు.ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటుగా మరిన్ని డిమాండ్ల సాధన కోసం
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు
సమ్మె బాట పట్టగా..
కేసీఆర్ తనదైన శైలి కఠిన వైఖరితో ముందుకు సాగుతున్నారు.
కార్మిక సంఘాలతో చర్చలకు ససేమిరా అంటున్న కేసీఆర్... కోర్టు ఆదేశాలతో కాస్తంత వెనక్కి తగ్గాడు అన్నట్లు అనిపించినా ... ఆదివారం నాడు కార్మిక సంఘాల నేతలను
అరెస్ట్ చేసిన తీరుతో సమ్మెపై తానెంత మాత్రం తగ్గలేదని - మునుపటి కంటే కూడా మరింత కఠినంగా వ్యవహరిస్తున్నానని
కేసీఆర్ చెప్పకనే చెప్పారు అని వాదనలు వినిపిస్తున్నాయి.
తమ డిమాండ్ల పరిష్కారం పక్కనపెట్టి... కనీసం తమతో చర్చలుకు ముందుకు రావాలని కార్మిక సంఘాలు చెప్పినా...
కేసీఆర్ కొంతైనా పట్టు వీడటం లేదు .తాము ఓ మెట్టు దిగినా... సర్కారు ఇంకా కఠినంగా వ్యవహరించిన తీరుతో కార్మిక సంఘాల నేతలు తమ తమ గృహాల్లోనే దీక్షలకు దిగారు. ఈ దీక్షలపై
కేసీఆర్ నిజంగానే కన్నెర్రజేశారు. పోలీసులను రంగంలోకి దించి ఇళ్లల్లోనే దీక్షలు చేస్తున్న కార్మిక సంఘాల నేతలు
అశ్వత్థామరెడ్డి - రాజిరెడ్డిలను బలవంతంగా ఆసుపత్రులకు తరలించేశారు.
ఈ సందర్బంగా చోటుచేసుకున్న ఘటనలను చూస్తే...
కేసీఆర్ నిజంగానే నియంతలా మారిపోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.కార్మిక సంఘం నేతల
అరెస్ట్ ల సందర్భంగా ఏం జరిగిందన్న విషయానికి వస్తే... గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న
అశ్వత్థామరెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు బలవంతంగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు
ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. ఎల్బీనగర్ లోని రెడ్డి కాలనీలో ఆయన ఇంటి తలుపులను రాళ్లతో పగలగొట్టి మరీ అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే... నిరాహారదీక్ష చేస్తున్న అశ్వత్థామరెడ్డిని పరామర్శించేందుకు వచ్చిన
బీజేపీ నేతలు
వివేక్ - జితేందర్ రెడ్డి - రామచంద్రరావు తదితరులను పోలీసులు అడ్డుకున్నారు.