బాలిక‌ను బెదిరించి దాదాపు ఐదు నెల‌ల పాటు త‌మ ప‌శుకామ వాంఛ‌ను తీర్చుకున్నారు ఐదుగురు దుర్మార్గులు... అయితే చివ‌రికి వారి పాపం ప‌డింది. ఇప్పుడు క‌ట‌క‌టాల వెన‌క్కు వెళ్లారు. ఈ దారుణ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులోని క‌డ‌లూరులో జ‌రిగింది. వీరందరిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం బాలిక‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించి వైద్యం అంద‌జేస్తున్నారు. తమిళనాడులోని కడలూరు జిల్లాకు చెందిన దంపతుల కుమార్తె(14) పుదుచ్చేరిలోని హాస్టల్‌లో ఉంటూ తొమ్మిదో తరగతి చదువుకుంటోంది. 


అయితే ఈ ఏడాది ఏప్రిల్‌లో సెలవుల కారణంగా ఇంటికి వచ్చిన బాలిక నెలన్నర రోజుల పాటు అక్కడే ఉంది. రెక్కాడితే గాని డొక్కాడ‌ని ఆ నిరుపేద త‌ల్లిదండ్రులు బాలిక‌ను ఇంటివ‌ద్దే ఉంచి కూలి ప‌నికి వెళ్లేవారు. తల్లిదండ్రులు రోజూ కూలి పనులకు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండేది.  కాల‌క్షేపానికి రోజూ పక్కనే ఉండే దాసు(41) ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లేది. బాలిక‌పై క‌న్నేసిన దాసు ఓ రోజూ అత్యాచారం చేశాడు. భ‌య‌టచెబితే చంపేస్తాన‌ని చెప్ప‌డంతో భ‌య‌ప‌డింది. 


ఈ క్ర‌మంలోనే బాలిక‌కు అదే ప్రాంతానికి చెందిన సూర్య(20) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. సూర్య ఆమెను తరుచూ బైక్‌పై తీసుకెళ్లి మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. వీరిద్ద‌రూ స‌న్నిహితంగా ఉన్న విష‌యం తెలుసుకున్న బాలిక స్నేహితులు సూర్య ఫ్రెండ్స్ మార్క్స్‌ (22), గోకుల్‌ (19), వీరయన్‌ (19) కూడా బ్లాక్ మెయిల్ చేసి  సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. దీని గురించి తెలుసుకున్న దాసు కూడా వారితో కలిసి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇలా సుమారు ఐదు నెలల పాటు ఐదుగురు బాలిక‌పై సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. ఓ రోజు స్కూల్‌లో బాలిక పడిపోవడంతో టీచర్లు వైద్య పరీక్షలు చేయించగా గర్భంతో ఉన్నట్లు తేలింది. దీంతో స్కూల్ యాజమాన్యం తల్లిదండ్రులకు సమాచారం అందించింది. బాలిక తల్లి ఏం జరిగిందని నిలదీయగా బాలిక తనపై జరిగిన అఘాయిత్యం గురించి చెప్పి విల‌పించింది. తల్లిదండ్రులు నాగపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా నిందితుల‌ను గుర్తించి అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: