పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ కు చెందిన 22 ఏళ్ల పూజ సింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది. కొన్నేళ్ల క్రితం తన ఇంటి పక్కన నివసిస్తున్న.. తమ కులానికే చెందిన... గజేంద్రతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ పరిచయం ప్రేమగా మారింది. ప్రక్క ప్రక్క ఇళ్లలోనే నివసిస్తున్న వీరిద్దరూ తరచుగా కలుసుకొని మాట్లాడుకునేవారు. వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందని పూజ వాళ్ళ తండ్రి హరివంశ్‌ కుమార్‌ పసిగట్టాడు. ఇది నచ్చని ఆమె తండ్రి తన కూతురి పై ఎంతో కోపం పెంచుకున్నాడు. అయితే శనివారం రోజు అర్ధరాత్రి గజేంద్ర పూజ వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నాడు. ఇదంతా చూసిన పూజ తండ్రి హరివంశ్ కుమార్ కోపంతో ఊగిపోయాడు. 


పూజ గజేంద్రతో మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చేసింది. ఆ సమయంలో పూజ వాళ్ళ అమ్మ అన్నయ్యలు గురుగ్రమ్ లో ఉన్నారు. అదే అదనుగా భావించి ఆ తండ్రి .. కన్న కూతురని కూడా చూడకుండా.. ఇంటి లోపలికి ఆమెను తీసుకెళ్లి అతి దారుణంగా షాక్ ఇచ్చాడు. పాపం ఆ 22ఏళ్ల పూజ ఆ కరెంట్ షాక్ తట్టుకోలేక కిందపడిపోయింది. అప్పటికీ ఆ తండ్రికి తన కూతురు పై ఎటువంటి జాలి కలగలేదు. కోపంతో ఊగిపోతున్న అతను ఒక కత్తిని తీసుకుని వచ్చి పూజ గొంతును అతి కిరాతకంగా కోసి ఆమెను హతమార్చాడు.


ఈ ఘటనతో పశ్చిమ ఉత్తరప్రదేశ్ లో గత 18 నెలల్లో 23 పరువు హత్యలు జరిగాయి. విచారణలో నిందితుడైన పూజా తండ్రి హరివంశీ కుమార్ నేరాన్ని అంగీకరించాడని పోలీసులు చెప్పారు. మృతురాలి సోదరుడైన యోగేశ్‌  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసే, పోస్టుమార్టం కొరకు పూజా మతదేహాన్ని తరలించామని పోలీసులు చెప్పారు. హరీష్ కుమార్ కి నలుగురు అబ్బాయిలు ఏకైక కుమార్తె.


మరింత సమాచారం తెలుసుకోండి: