సమాజంలో రోజు రోజుకు మైనర్ బాలికలు, మహిళలపై అత్యాచారాలే పెరిగిపోతూనే ఉన్నాయి. ఈ విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇవి మాత్రం ఆగడం లేదు. మైనర్ బాలికలను ప్రేమ పేరుతో బెదిరించి లొంగ దీసుకునే వారు కొందరు అయితే.. తెలిసీ తెలియని వయస్సులో ప్రేమ, ఆకర్షణలకు లొంగి పోతున్న వారు మరికొందరు ఉంటున్నారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలానికి చెందిన ఓ గ్రామంలో వెలుగులోకి వచ్చిన దారుణ సంఘటన ఇది.
గ్రామానికి చెందిన బాలికపై అప్పలరాజు అనే వ్యక్తి కన్నేసి… ఆమె స్నానం చేస్తున్నప్పుడు ఫోటోలు, వీడియోలు తీసి వాటిని బయటపెడుతానని బెదిరించాడు. ఈ క్రమంలోనే ఆమెను లోబరుచుకుని తన శారీరక అవసరాలు తీర్చుకుంటున్నాడు. దాదాపు రెండు సంవత్సరాలుగా ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఆ బాలిక గర్భం దాల్చింది.
ఈ విషయం బాలిక తల్లితండ్రులకు తెలియటంతో వాళ్లు షాక్ అయ్యారు. దీంతో ఆ బాలికను మందలించి... ఎవ్వరికి తెలియకుండా ఆమెకు వారం రోజుల క్రితం మరో వ్యక్తితో పెళ్లి చేసేశారు. పెళ్లి అయిన వారానికే ఈ బాలికపై అత్తింటి వారికి ఎవరో విషయం చెప్పటంతో… ఆ బాలిక అత్త-మామ వైద్య పరీక్షలు చేయించగా ఆమె నాలుగు నెలల గర్భవతి అని తెలిసింది.
దీంతో అత్త మామలు ఆ బాలికను తిట్టి పుట్టింటికి పంపేశారు. వారంతా ఆమెను గట్టిగా నిలదీయటంతో… ఆమె పురుగుల మందు తాగింది. ప్రస్తుతం ఆమె ఓ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుంటుండగా, అసలు విషయాన్ని బాలిక బయటపెట్టింది. కాకినాడ పోలీసులు చాకచక్యంగా అప్పలరాజును అరెస్ట్ చేశారు. గురువారం కోర్టులో హజరుపరుస్తామని, కఠిన శిక్ష పడేలా చూస్తామని హమీ ఇచ్చారు. ఈ సంఘటనపై జిల్లాలో మహిళా సంఘాలు తీవ్రంగా మండి పడుతున్నాయి. బాధితురాలికి న్యాయం జరిగేలా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.