ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సీఎం రమేశ్ ఏ స్థాయిలో చలామణి అయ్యారో మన అందరికి తెలిసిన విషయమే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ఉండేవారు సీఎం రమేశ్. ఆ ప్రభుత్వంలో ఎన్నో కాంట్రాక్టులను చేపట్టారు ఆయన. అలాగే రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తూ బోలెడన్ని వ్యవహారాలను దెగ్గర ఉండి నడిపించారనే పేరునూ కలిగి ఉన్నారు.

 

మొన్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిందో లేదో, ఇలా బీజేపీలోకి జంప్ చేసేశారు. అంతవరకూ చంద్రబాబుకు అతి సన్నిహితంగా మెలిగినా టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఆయన జంప్ అయిపోవడం గమనార్హం. అదంతా ఆయన కాంట్రాక్టుల కోసమే అనే ప్రచారం కూడా గట్టిగా సాగింది.తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన బోలెడన్ని కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని క్లియర్ చేయించుకోవడం కోసమే ఆయన తెలుగుదేశం పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి చేరిపోయినట్టుగా వారతలు వచ్చాయి.

 

మరి ఏం జరిగిందో కానీ ఇప్పుడు సీఎం రమేశ్ కాంట్రాక్టులకు సంబంధించి బిల్లులు మొత్తం త్వరత్వరగా క్లియర్ అవుతున్నట్టుగా సమాచారం. పార్టీలు అధికారం చేతులు మార్చుకున్నప్పుడు కాంట్రాక్టర్లు అయిన రాజకీయ నేతలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు.గతంలో వైసీపీలో ఉండిన నేతలది ఇలాంటి పరిస్థితే ఎదురుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ వారు పాత బిల్లులను రిలీజ్ చేయించుకోలేకపోయారు.

 

నానా కష్టాలు పడ్డారు కానీ చేసిన పనులకు కూడా వారు బిల్లులు విడుదల చేయించుకోలేకపోయారు. అయితే ఇప్పుడు సీఎం రమేశ్ కు అలాంటి ఇబ్బంది కలగడం లేదట. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఒక ముఖ్య నేతతో సీఎం రమేశ్ కు సాన్నిహిత్యం ఉందని పార్టీలో ఆయనకు మంచి ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయన అండతో సీఎం రమేశ్ తన బిల్లులను చకచకా క్లియర్ చేయించుకుంటున్నట్టుగా ఒక ప్రచారం సాగుతూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: