జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్లీన్ పాలిటిక్స్ చేస్తానని ఇప్పుడు డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారు. ఒక పక్క జగన్ ఏపీ సీఎంగా ఎన్నో సంచలన నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. కానీ జగన్ మంచి పనులను మెచ్చుకోని ఈ పెద్ద మనిషి ఇప్పుడు చివరికి మత రాజకీయాలను చేసేందుకు సిద్ధపడుతున్నాడు. తను కుల రాజకీయాలు చేయనంటూ ఎక్కువగా కులం గురించి మాట్లాడిన నేతగా నిలిచారు పవన్ కల్యాణ్. తను కాపుల ఓట్లను క్యాష్ చేసుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదంటూ.. రాష్ట్రంలో కాపుల జనసంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఆయన పోటీ చేశారు.

 

కానీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయి తన స్థాయేంటో ప్రజలు చెప్పకనే చెప్పారు. అయినా పవన్ ఇంకా మారలేదు. తన పార్టీ అభ్యర్థుల తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేసింది కూడా కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోనే. కాపుల ప్రభావం ఉండదనే చోట పవన్ కల్యాణ్ అసలు ఎన్నికల సమయం లో కూడా ప్రచారం చేయలేదు. అదీ పవన్ కల్యాణ్ కుల రాజకీయం. అయితే తను కుల రాజకీయం చేయనని పవన్ తరచూ చెబుతూ ఉంటారు. అయితే అంత జేసినా పవన్ కల్యాణ్ కనీసం ఎమ్మెల్యే గా నెగ్గ లేకపోయారు. కాపుల నియోజకవర్గాల్లోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తాజాగా పవన్ కల్యాణ్ మతపరమైన అంశాల గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. జెరుసలేం వెళ్లే క్రైస్తవులకు ఆర్థిక సాయం పెంచడాన్ని పవన్ కల్యాణ్ తప్పు పట్టారు.

 

ఇలా పవన్ గారి రాజకీయం దారి తప్పి చివరికి మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేసేందుకు వెనుకాడటం లేదు. అంతటితో ఆగలేదు. హిందూ దేవాలయాల నుంచి టాక్సులు వసూలు చేస్తున్నారని చర్చిలు పన్నులు కట్టడం లేదని పవన్ అంటున్నారు. ఇలా మతాల పరమైన తేడాలను హైలెట్ చేస్తూ పవన్ మాట్లాడుతూ ఉన్నాడు. క్రైస్తవుల ఓట్లు కావాలనుకున్నప్పుడు తన మూడో భార్య తన పిల్లలు క్రైస్తవులు అని ప్రకటించుకునే పవన్ కల్యాణ్ ఇప్పుడు హిందూ రాజకీయం చేయాలని ఇలా మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. అయితే పవన్ కల్యాణ్ కు అవగాహన లేక పోవచ్చు కానీ..జెరుసలేంకు వెళ్లే క్రైస్తవులకు డబ్బులు ఇవ్వడం అనేది చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభం అయిన వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ హయాం లో చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో ఆ  ప్రోగ్రామ్ మొదలు పెట్టారు. అప్పుడు పవన్ మాట్లాడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: