హైదరాబాద్ లో రోజు రోజుకు యాక్సిడెంట్లు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ వారంలో అయితే మరి దారుణంగా పెరిగాయి. గత శనివారం ఆ ఫ్లై ఓవర్ పైనుంచి కారు పడిన సమయం నుంచి మరి దారుణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇంకా విషయానికి వస్తే ఈరోజు ఆరాంఘర్‌ చౌరస్తా వద్ద గోరా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.     

 

రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు విద్యార్థులు అక్కడిక్కడే మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విద్యార్థులు మాదాపూర్‎లోని నారాయణ కాలేజీ విద్యార్థులు‎గా గుర్తించారు. గురువారం క్యాంపస్‌ నుంచి విద్యార్థులు తమకు చెప్పకుండా వెళ్లిపోయారని కాలేజీ యాజమాన్యం చెబుతోంది. బర్త్‌డే పార్టీకి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.      

 

అయితే నిన్నా అర్ధరాత్రి మాదాపూర్ నారాయణ మెడికల్ లాంగ్ టర్మ్ కోచింగ్ సెంటర్ క్యాంపస్ నుండి గోడా దూకి 9 మంది విద్యార్థులు పారిపోయారు. డైరీ ఫారం ఎక్స్ రోడ్డు వద్ద యాక్సిడెంట్ లో చనిపోయిన ఇద్దరు  తరుణ్, ఉదయ్ అనే విద్యార్థులు, శానక్ అనే విద్యార్థికి తీవ్రగాయాలు అయ్యాయి. ఫ్రెండ్ బర్త్ డే కోసం గోడ దూకి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.    

 

బర్త్డే పార్టీ ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. అరంగల్ చౌరస్తా లో సడన్ బ్రేక్ వేయడంతో టిఎస్ 07 ఈబి 3680 సఫారీ స్ట్రామ్ కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. కారులో ఉన్న ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని రాజేంద్రనగర్ పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.       

మరింత సమాచారం తెలుసుకోండి: