ప్రియాంక రెడ్డి హత్యాచారం నిందితులు మృగాలు సైతం తలదించుకునేలా ప్రవర్తించారు. మృతురాలిని అత్యంత పాశవికంగా క్షోభ పెట్టారు. మీడియా కు అందిన సమాచారం ప్రకారం, నిందితులు బాగా మద్యం సేవించి అత్యంత దారుణంగా యువతిని హింసించి అత్యాచారం చేశారు. నలుగురు నిందితుల్లో ఇద్దరు ఈ దారుణాన్ని ఎవ్వరూ చూడకుండా కాపలా కాయగా మరో ఇద్దరు అఘాయాత్యానికి పాల్పడ్డారు ఇలా ఇద్దరు ఇద్దరుగా యువతిపై దాదాపు గంట పైగా అత్యాచారానికి పాల్పడ్డారు. తనను వదిలివేయాల్సిందిగా ప్రియాంక రెడ్డి వేడుకున్నా ఈ నరరూప రాక్షసులు కనికరం చూపించలేదు. నిర్మానుష్య ప్రాంతం కావడంతో ప్రియాంక రెడ్డి ఆవేదన ఎవ్వరికీ వినపడలేదు. అఘాయిత్యం చేసేటప్పుడు యువతి ప్రతిఘటిస్తున్న సమయంలో నోట్లో బలవంతంగా మద్యం పోశారు. 

 

యువతి ప్రతిఘటిస్తున్న సమయంలో అరవకుండా నోరు, ముక్కు మూయడంతో ప్రియాంక రెడ్డి ఊపిరి ఆడక చనిపోయింది. ప్రియాంక చనిపోయిన తరువాత మృతదేహం పై కూడా ఈ మానవ మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. దాదాపు అరగంట పాటు మృతదేహంపై కూడా కిరాతకానికి పాల్పడి మృతదేహాన్ని లారీలో ఎక్కించారు, ఆ సమయంలో మృతురాలికి ప్యాంటు కూడా లేదు. మార్గం మధ్యంలో కూడా ఈ నీచులు మరోసారి అఘాయిత్యానికి ఒడికట్టారు. మృతురాలిని ఫ్లైఓవర్ కింద ధించిన తరువాత మృతదేహానికి ప్యాంటు వేసినట్లు సమాచారం. వినడానికే భయం కలిగిస్తున్న ఈ ఘటనలో ప్రియాంక రెడ్డి నరకం అనుభవించి ఉంటుంది. 

 

తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా!

 

తొండుపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రియాంక రెడ్డి స్కూటీ పార్క్ చెయ్యడానికి ప్రయత్నించగా టోల్ ప్లాజా సిబ్బంది వద్దనడంతో, తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు జంక్షన్ వద్ద స్కూటీని పార్క్ చేసింది ప్రియాంక రెడ్డి. అయితే ఈ ప్రాంతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా అని అక్కడి స్థానికులు చెప్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, రాయలసీమ తదితర ప్రాంతాల నుంచి వచ్చే లారీలు అధిక శాతం ఇక్కడ ఆగుతుంటాయి. సాయంత్రం అయితే చాలు లారీ డ్రైవర్లు ఇక్కడే మద్యం సేవిస్తూ ఉంటారు అని స్థానికులు పేర్కొన్నారు. ఇంత దారుణంగా యువతిని హతమార్చిన నిందితులను వెంటనే ఉరి తియ్యాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: